చలో సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక పై ఇంస్టాగ్రామ్ లో పనికిమాలిన ట్రోల్స్ అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈమె పైనే కాదు ప్రతి సినీ కళాకారుడుపై ఒక హద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తుంటారు ఈ ట్రోల్స్. అయితే చాలా మంది సెలబ్రిటీస్ ఈ డర్టీ కామెంట్స్ ని అంతగా పట్టించుకోరు. కానీ ఏదో ఒక సందర్బంలో తమ ఓపికని కోల్పోతే ఈ ట్రోల్స్ కి బుద్ధి వచ్చేట్లు సమాధానం ఇస్తారు. ఇపుడు ఆ ఓపిక కోల్పోయింది ఎవరంటే.... రష్మిక మందన్న. 

 

 
ఇక లాభం లేదనుకుంటూ... రష్మిక ట్రోల్స్ కి ఓ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. "మమల్ని ట్రోలింగ్ చేయడం వల్ల మీకేమొస్తుందో నాకు అర్ధం కావట్లేదు. మేము ఈజీ టార్గెట్ కాబట్టి కామెంట్స్ చేస్తున్నారా? పబ్లిక్ ఫిగర్స్ అంటే మీరు ఘోరంగా టార్గెట్ చేసే... మీతో తిట్టించుకునే వాళ్ళు కాదు. చాలా మంది బ్యాడ్ కామెంట్స్ ని పట్టించుకోవద్దని చెప్తున్నారు.. నేను కూడా అదే చేస్తున్న. మేం చేసే పని గురించి మీరేదేనా అనండి మీకు అనే హక్కు కూడా ఉంది కానీ మా వ్యక్తిగత జీవితం గురించి మా కుటుంబం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. మీరు మాట్లాడే పెంట ఏ యాక్టర్ భరించాల్సిన అవసరం లేదు.
 
ఎందుకంటే  యాక్టర్ గా ఉండటం అంత సులభం కాదు. ప్రతి ఒక్క వృత్తి గౌరవించదగ్గదే. ఫస్టు ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని నేను అనుకుంటున్న." 
 
 
ఆమె పై రాసిన ట్రోలింగ్ ని ఉద్దేశిస్తూ... "ఇది ఎవరు చేసారో వారికి నా అభిమానాలు ఎందుకంటే మీరు నన్ను బాధించగలిగారు" అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో రాసింది.  తాపసి పన్ను, సమంత అక్కినేని.. ఇంకా ఇతర టాలీవుడ్ బామలు ట్రోల్స్ కి గడ్డి పెట్టినా ట్రోలింగ్ చేయడం మాత్రం వాళ్ళు ఇంకా మానేయడంలేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: