మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ కలిగిన సినిమాగా తెరకెక్కిన సైరా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. చిరంజీవి కెరీర్ లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులను చెరిపివేసింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో మంచి జోష్ మీద ఉన్న చిరంజీవి తర్వాత చేయబోయే కొరటాల శివ సినిమా కోసం బరువు తగ్గించుకునే పనిలో ప్రస్తుతం ఉన్నారు. దాదాపు రెండు సంవత్సరాల సమయం సైరా సినిమా కేటాయించడం తో చిరంజీవి కొరటాలతో చేయబోయే సినిమా సమ్మర్ కల్లా రిలీజ్ చేయడానికి డిసైడ్ అయినట్లు దీంతో పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్ అన్ని ఖరారు చేయాలని నిర్మాత రామ్ చరణ్ కి డైరెక్టర్ కొరటాల కి ముందే చిరంజీవి సూచించడంతో ఈ సినిమాకి సంబంధించిన అన్ని షెడ్యూల్ మిగతా అన్ని కార్యక్రమాల విషయాలలో డైరెక్టర్ మరియు నిర్మాత ఫుల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.


వచ్చే డిసెంబర్ నుండి మొదలు కానున్న ఈ సినిమా షూటింగ్ లో చిరంజీవి పక్కన హీరోయిన్ గా చెన్నై బ్యూటీ త్రిష ఎంపికైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాజకీయాల నుండి సినిమాల్లోకి చిరంజీవి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమాలను నిర్మిస్తున్న రామ్ చరణ్ ఇటీవల మలయాళం మూవీ 'లూసిఫర్' తెలుగు రైట్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తెలుగులో రిలీజ్ అయినప్పటికీ సోల్ పాయింట్ ని తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ తో మరింత గ్రాండియర్ గా తెరకెక్కించాలని చరణ్ అప్పట్లో ఆలోచించిన నేపథ్యంలో ఆ సినిమాకు దర్శకుడిగా సుకుమార్ అనుకున్నారని తెలిసింది.


మొదట సుకుమార్ కూడా పాజిటివ్ గా స్పందించినప్పటికీ మళ్ళీ మనసు మార్చుకొని రీమేక్ కథకంటే సొంతంగా చిరంజీవితో సినిమా చేయడం బెటర్ అని సుకుమార్ చిరంజీవికి మరియు నిర్మాత రామ్ చరణ్ కి షాక్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో రామ్ చరణ్ లూసిఫర్ కథ తోనే చిరంజీవి ని హీరోగా పెట్టి వేరే డైరెక్టర్ తో ఎలాగైనా తెరకెక్కించడానికి డిసైడ్ అయినట్లు ఈ సందర్భంగా ఇతర డైరెక్టర్లతో రామ్ చరణ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కొరటాల సినిమా పూర్తయిన వెంటనే 'లూసిఫర్' రీమేక్ సినిమానే పట్టా లెక్కించడానికి రామ్ చరణ్ రెడీ అవుతున్నారట. మరి చిరంజీవితో 'లూసిఫర్' సినిమా తీసే డైరెక్టర్ ఎవరు అవుతారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: