జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమాను సంక్రాంతి పండుగ కానుకగా 2020 జనవరి 12వ తేదీన విడుదల చేస్తామని ఈ సినిమా మేకర్స్ గతంలో ప్రకటించారు. మరోవైపు మహేశ్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సరిలేరు నీకెవ్వరు సినిమాను కూడా 2020 జనవరి 12వ తేదీనే విడుదల చేస్తామని సరిలేరు నీకెవ్వరు సినిమా మేకర్స్ ప్రకటించారు. 
 
ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలైతే రెండు సినిమాలు నష్టపోవాల్సి వస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకే రోజు విడుదలైతే రెండు సినిమాల ఓపెనింగ్స్ మీద ప్రభావం పడే అవకాశం ఉందని ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల నుండి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజు సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించటంతో ఈ రెండు సినిమాల బయ్యర్లు కూడా టెన్షన్ పడ్డారు. 
 
ఫ్యాన్స్, బయ్యర్ల నుండి వ్యతిరేకత వ్యక్తమవటంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు రిలీజ్ డేట్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అల వైకుంఠపురములో సినిమా జనవరి 11వ తేదీన విడుదల కానుండగా సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 13వ తేదీన విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల మేకర్స్ అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో రిలీజ్ డేట్ల గురించి ప్రకటిస్తారని తెలుస్తోంది. 
 
రెండు భారీ సినిమాలు రెండు రోజుల గ్యాప్ తో విడుదల కాబోతూ ఉండటంతో అటు బయ్యర్లకు ఇటు అభిమానులకు టెన్షన్ తీరినట్లే అని చెప్పవచ్చు. మహేశ్ బాబుకు జోడీగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక మందన్న నటిస్తుండగా అల్లు అర్జున్ కు జోడీగా అల వైకుంఠపురములో సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది. అల వైకుంఠపురములో సినిమాకు థమన్ సంగీతం అందించగా సరిలేరు నీకెవ్వరు సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: