ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలైతే రెండు సినిమాలు నష్టపోవాల్సి వస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకే రోజు విడుదలైతే రెండు సినిమాల ఓపెనింగ్స్ మీద ప్రభావం పడే అవకాశం ఉందని ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల నుండి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజు సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించటంతో ఈ రెండు సినిమాల బయ్యర్లు కూడా టెన్షన్ పడ్డారు.
ఫ్యాన్స్, బయ్యర్ల నుండి వ్యతిరేకత వ్యక్తమవటంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు రిలీజ్ డేట్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అల వైకుంఠపురములో సినిమా జనవరి 11వ తేదీన విడుదల కానుండగా సరిలేరు నీకెవ్వరు
సినిమా జనవరి 13వ తేదీన విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల మేకర్స్ అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో రిలీజ్ డేట్ల గురించి ప్రకటిస్తారని తెలుస్తోంది.