బిగ్ బాస్ అయిపోయి నాలుగు రోజులు అవుతున్నా..దాని గురించిన వార్తలు రోజుకి ఒకటి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ లో అమ్మాయిలు ఎందుకు గెలవరనే చర్చ మొదలైంది. ఇప్పటికి మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న తెలుగు బిగ్ బాస్ లో ముగ్గురు విజేతలు మగవాళ్ళే కావడం ఒక విషయమయితే ముగ్గురు రన్నరప్ లు ఆడవాళ్ళు కావడమే విశేషం. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ లో అందరికీ సుపరిచితమయిన శ్రీముఖి హౌస్ లోకి అడుగుపెట్టింది.


హౌస్ లో తనదైన ఎంటర్ టైన్ మెంట్ ని పంచింది. చివరి వరకు ఆమె బిగ్ బాస్ గెలవడానికి అన్ని విధాల అర్హురాలిగానే ఉంది. ఖచ్చితంగా శ్రీముఖి గెలుస్తుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా రాహుల్ టైటిల్ గెలిచి ఆశ్చర్యపరిచాడు. అప్పటి వరకు శ్రీముఖి గెలుస్తుందనుకున్న వాళ్లకి కోలుకోలేని షాక్ తగిలింది. కొందరు ఈ సీజన్ కి శ్రీముఖి గెలవడమే కరెక్ట్ అని అంటుంటే మరికొందరు వాళ్ళు గెలవలేదు కాబట్టి అలాంటి వాదనలే చేస్తారు అని అంటున్నారు.


అయితే ఏది ఏమైనా ఈ సీజన్ లో నైనా అమ్మాయికి టైటిల్ వస్తుందని ఆశించిన వారి ఆశలు అడియాశలయ్యాయి. రాహుల్ గెలిచిన విషయం పక్కన పెడితే శ్రీముఖి ఎందుకు గెలవలేదన్నది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే. బిగ్ బాస్ హౌస్ విజేతగా అమ్మాయిలు కారా? అన్న సందేహం ముగిసిన మూడు సీజన్లను చూస్తే డౌట్ రాక మానదు. ఇందుకు తగ్గట్లే తాజాగా రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి సైతం తన మనసులోని మాటను ఒక ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పేసింది. 


భవిష్యత్తులో  జరిగే సీజన్లలో అయినా బిగ్ బాస్ టైటిల్ ను అమ్మయిలు గెలిస్తే చూడాలని తాను అనుకుంటున్నట్లుగా ఆమె చెప్పారు. మరి శ్రీముఖి కోరిక నెరవేరుతుందా లేదా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: