మరో సారి సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలోని సభ్యుడు సినీ రంగలోకి దిగారు  ,సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు  మేన‌ల్లుడు, గల్లా జ‌యదేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. అశోక్ డెబ్యూ మూవీ అక్టోబ‌ర్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.

ఈ కార్య‌క్ర‌మానికి సూప‌ర్ స్టార్ కృష్ణ‌,రాఘ‌వేంద్ర‌రావు, మంజుల, దిల్ రాజు తదితరులు హాజ‌ర‌య్యారు. అస్సలు విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి తొలి క్లాప్ సూప‌ర్ స్టార్ కృష్ణ కొట్టారు. శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కాల్సి ఉన్న ఈ చిత్రం  అనేక సార్లు కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆగింది. ఈ చిత్రానికి “అదే నువ్వు అదే నేను” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా అశోక్ డెబ్యూ మూవీకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది .


న‌వంబ‌ర్ 10న అశోక్ డెబ్యూ చిత్రం  గ్రాండ్‌గా లాంచ్ కానుంది.గిబ్రాన్  ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని సూపర్  స్టార్ ఫ్యామిలీ , ఇతర సినీ వర్గాలు కోరుకుంటున్నారు  . శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలోతెర‌కెక్క‌నున్న ఈ చిత్రంకి సంగీతం అందించ‌నున్నారు. ఈ చిత్ర నిర్మాత ప‌ద్మావ‌తి గ‌ల్లా . ఇక క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేసార‌నే విష‌యం తెలియాల్సి ఉంది.  కొన్నాళ్ళుగా అమెరికాలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో న‌ట‌న‌కి సంబంధించిన శిక్ష‌ణ అశోక్ తీసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది.


అయితే ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న అశోక్ తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి. సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకొని టాలీవుడ్ వెండితెర‌పై మ‌రో సూప‌ర్ స్టార్‌గా ఎదిగారు మ‌హేష్ బాబు. ఆయ‌న త‌న‌యుడు గౌత‌మ్ కూడా 1 నేనొక్క‌డినే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఇక మ‌హేష్ ఫ్యామిలీ నుండి సుధీర్ బాబు, మంజుల‌, ఆమె కూతురు జాన్వీ కూడా వెండితెర‌పై మెరిసిన విషయం విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: