బిగ్ బాస్ సీజన్ 3 ముగియడంతో బిగ్ బాస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే ఫ్యాన్స్ కాస్త బోర్ కొడుతుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ షోని ఓన్ చేసుకుని ఓటింగ్ చేస్తూ టైటిల్ విన్నర్ ను గెలిపించడం ఒక బాధ్యతగా చేస్తున్నారు. ఇదిలాఉంటే బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ అందుకున్నాడు.


శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది.. చివరి వరకు రాహుల్ తో పాటుగా శ్రీముఖి వచ్చింది. అయితే ఈ సీజన్ లో శ్రీముఖికి టైటిల్ వస్తుందని ఊహించారు. కాని శ్రీముఖిని వెనక్కి నెట్టేసి రాహుల్ కు ఆ ఛాన్స్ ఇచ్చారు. ఆడియెన్స్ ఓటింగ్ ద్వారానే విజేత ఎంపిక అని చెబుతున్నారు. అయితే బిగ్ బాస్ విజేతగా నిలిచే అవకాశం అమ్మాయిలకు లేదా అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది.


రీసెంట్ గా సీనియర్ యాంకర్ ఝాన్సి కూడా ఇదే విషయం గురించి చెప్పారు. బిగ్ బాస్ టైటిల్ అమ్మాయిలకు రానివ్వరా అంటూ ఆమె ఫైర్ అయ్యింది. ఇక ఇప్పుడు శ్రీముఖి కూడా అదే అర్ధం వచ్చేలా కామెంట్స్ చేస్తుంది. బిగ్ బాస్ లో అమ్మాయిలు గెలిచే ఛాన్స్ లేదా.. రానున్న సీజన్ లలో అయినా అది జరగాలని కోరుకుంటున్నా అని అన్నది శ్రీముఖి.


బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో శివ బాలాజి, ఆదర్శ్ టాప్ 2లో ఉన్నారు. అయితే ఆ సీజన్ లో హరితేజకు గెలిచే ఛాన్స్ ఉన్నా ఫైనల్ వీక్ వెనకపడ్డది. ఇక సెకండ్ సీజన్ లో కౌశల్, గీతా మాధురి ఇద్దరు ఫైనల్స్ కు చేరారు. అయితే గీతా మాధురి రన్నరప్ కాగా కౌశల్ టైటిల్ అందుకున్నాడు. ఇక ఈ సీజన్ లో శ్రీముఖి, రాహుల్ లలో రాహుల్ ను గెలిపించి శ్రీముఖిని రన్నరప్ చేశారు. మరి రానున్న సీజన్స్ లో అయినా అమ్మాయిలు టైటిల్ విన్నర్ గా నిలుస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: