ఈ మద్య విక్టరీ వెంకటేష్ వరుసగా మల్టీ స్టారర్ మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్-వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. పూర్తిగా వినోదభరితంగా తెరకెక్కిన ఈ మూవీ మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. తాజాగా బాబీ దర్శకత్వంలో వెంకటేష్-నాగ చైతన్య మామా అల్లుళ్లుగా ‘వెంకి మామ’ మూవీ తెరకెక్కుతుంది. రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ మామా అల్లుళ్లయిన విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు ఈ మూవీతో అదరగొట్ట బోతున్నారట. 


‘వెంకీ మామ’ ఫస్ట్ గ్లిమ్స్ దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేశారు. యాక్షన్‌తోపాటు సరదా సన్నివేశంతో రూపొందించిన ఈ వీడియో అక్కినేని, దగ్గుబాటి అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ‘గోదావరిలో ఈత నేర్పా, బరిలో ఆట నేర్పా, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు’ అనే డైలాగుతో నిజజీవిత మామ అల్లుళ్ళు సినిమాలో కూడా అదే పాత్రలలో సందడి చెయ్యబోతున్నారని అర్ధం అవుతుంది. ముప్పై సెకండ్ల ఫస్ట్ గ్లిమ్స్ తో సినిమాపై అప్పుడే భారీ అంచనాలు పెరిగిపోయాయి.


తాజాగా వెంకీ మామ మూవీ టైటిల్ సాంగ్ రిలీజైంది. తమన్ సంగీతం అందించిన ఈ పాటకు సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన వస్తోంది. ఈ మూవీకి కేఎస్‌ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా, వెంకీకి జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్నారు. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన చివరి పాట రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశారు. మొత్తానికి సినిమా పూర్తి చేసుకొని త్వరలో రిలీజ్ కి సిద్దం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: