స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూడవ సినిమా 'అల వైకుంఠపురములో'. ఇప్పటికే చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ
సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు
సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ స్వరపరిచిన రెండు సాంగ్స్
ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ సంపాదించడంతో పాటు, అమాంతం సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇక వాటిలో 'రాములో రాముల' సాంగ్, 24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన
సౌత్ ఇండియన్ సాంగ్ గా రికార్డు ని దక్కించుకోగా, 'సామజవరాగమనా' లిరికల్ సాంగ్,
అత్యధిక లైక్స్ పొందిన తెలుగు సాంగ్ గా
యూట్యూబ్ లో అద్భుతమైన రికార్డుని నెలకొల్పింది. ఇకపోతే అతి త్వరలో ఈ సాంగ్ ఫుల్ వీడియోని రిలీజ్ చేయబోతున్నట్లు
హీరో అల్లు అర్జున్ కాసేపటి క్రితం తన సోషల్
మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేస్తూ తెల్పడం జరిగింది. ఇక ఆయన చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్
మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ మాత్రం ఆ సాంగ్ వీడియో కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే
హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్,
హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని, నవీన్ నూలి ఎడిటింగ్ ని అందిస్తున్నారు. కాగా ఈ
సినిమా 2020 సంక్రాంతి కానుకగా
జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. వాస్తవానికి గతంలో బన్నీ మరియు
త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి మరియు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి
సక్సెస్ సాధించి ఉండడంతో, ఈ సినిమాతో వారిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ దక్కడం ఖాయమని బన్నీ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి వారి ఆశలను ఈ
సినిమా ఎంతవరకు నేవేరుస్తుందో చూడాలి.....!!