సినిమాను చూపిస్తాను అంటూ చుట్టూ చిక్కులతో సతమతమవుతున్నారు కొట్లాటల వర్మ.. కమ్మారజ్యంలో
కడప రెడ్లు
సినిమా కు వర్మ వెలుగులు తిద్దుతున్నాడు.. ఆ వెలుగే కామెంట్ల రూపంలో అందరినీ కాళికలుగా మార్చుతుంది. రాజకీయాల హేళన చేస్తుంది అంటూ ఆరోపణలను ఎదుర్కొంటుంది.. ప్రతి ఒక్కరి నోట్లో ఈ
సినిమా నానుతుంది.
కథ స్క్రీన్ ప్లే వర్మ చూడగా.. తన శిష్యుడు సిద్దార్థ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నిన్న
దీపావళి సందర్భంగా ఈ
సినిమా ట్రైలర్ ను ప్రేక్షకులకు అందించాడు. ఆ ట్రైలర్ లో మొత్తం రాజకీయ ప్రముఖులు కనపడగా ..ముఖ్యంగా చంద్రబాబు అతని కొడుకు పప్పు సన్నివేశాలు చాలా బాగా కుదిరాయి.
పవన్ కళ్యాణ్ , కే ఏ పాల్ , వైఎస్
జగన్ వంటి ప్రముఖులు కూడా ఈ సినిమాలో ఉన్నారని అర్థమవుతుంది. ఈ
సినిమా కూడా రాజకీయ ప్రలోపాలకు దారి తీస్తుందని అర్థమవుతుంది.
తాజాగా అనంతరపురం
కాంగ్రెస్ నాయకులు వర్మపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వర్మ తెరకెక్కి్స్తున్న
కమ్మ రాజ్యంలో
కడప రెడ్లు
సినిమా టైటిల్ను రద్దు చేయాలంటే అనంతపురం
కాంగ్రెస్ నేతలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.అయినా కానీ అడిగి మరి గేలుక్కోడం కాకపోతే వర్మకు ఇది అవసరమంటావా అని సినీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి..ఎంతవరకు వెళ్తుందో చూడాలి..
అసలు విషయానికొస్తే.. బెజవాడకు చెందిన ప్రముఖ కాపు నాయకుడు వంగవీటి రంగ తనయుడు, ఒకప్పటి
వైసీపీ నేత అయిన వంగవీటి రాధ పాత్రను వర్మ తాజాగా వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ పాత్రలో ధన్రాజ్ నటించాడు. అయితే, ఈ పాత్ర పేరును సినిమాలో గంగవీటి భవాని అని పెట్టారు వర్మ. ఈ భవానీని సిట్ ఆఫీసర్ సుందరి
పోలీస్ స్టేషన్లో బట్టలు విప్పించి మరీ ఇంటరాగేషన్ చేస్తోంది.ఇది ఇలా ఉండగా ఆ సిట్ ఆఫీసర్ సుందరి ఎవరో కాదు న్యూస్ ప్రెజెంటర్, యాంకర్ స్వప్న. ఈ పోస్టర్ను వదులుతూ వర్మ చేసిన రెండు ట్వీట్లు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. మరి
సినిమా ఎన్ని మాటలను మూట కట్టుకుంటుందో చూడాలి..