మహేష్ బాబు చేతుల మీదుగా నవంబర్ 7 వ తేదీన దర్బార్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.  అంతేకాదు రజినీకాంత్ సర్ మోషన్ పోస్టర్ చాలా బాగుందని, సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చెప్తూ ట్వీట్ చేశాడు.  దీనికి మహేష్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. మరోవైపు, నిన్న కమల్ హాసన్ పుట్టినరోజు.  దానికి కూడా మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపాడు.  ఇది సంతోషించదగిన విషయం అని చెప్పాలి.  కోలీవుడ్ లో ఇద్దరు సీనియర్లు.. దేశం గర్వించదగిన నటులు.. వారికి శుభాకాంక్షలు చెప్పడం తప్పులేదు.  


మహేష్ ఫ్యాన్స్ ఈ విషయంపై మహేష్ ను పెద్ద ఎత్తున పొగుడుతూ ఆ ట్వీట్ ను హైలైట్ చేశారు.  ఆ రెండు ట్వీట్స్ ట్రెండ్ అయ్యాయి.  ఇంతవరకు బాగానే ఉన్నది. అయితే, నిన్నటి రోజున టాలీవుడ్ టాప్ దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు కూడా ఉన్నది.  మహేష్ బాబుకు అతడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు.  మహేష్ తో కలిసి ఎన్నోయాడ్  ఫిలిమ్స్ చేశాడు.  అలాగే, బుల్లితెరపై ఇప్పటికి ఆకట్టుకుంటున్న ఖలేజా వంటి సినిమాను ఇచ్చాడు త్రివిక్రమ్.  


అటువంటి త్రివిక్రమ్ గురించి మహేష్ బాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దీంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  త్రివిక్రమ్ గురించి మహేష్ బాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని మండిపడుతున్నారు.  అయితే, ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో ఒప్పుకోవడం లేదు.. మహేష్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పి ఉంటారు అని సమర్ధించుకుంటున్నారు. మహేష్ పై ఈగ వాలనివ్వడం లేదు.  


ఇదిలా ఉంటె, బాహుబలి వంటి హిట్ సినిమల్లో నటించిన అనుష్క గురించి కూడా ఒక్క మాట చెప్పకపోవడంతో ఆమె ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.  మహేష్ బాబు అనుష్క గురించి కూడా ఏమి చెప్పలేదని, కోలీవుడ్ స్టార్స్ గురించి మాట్లాడుతున్న మహేష్ బాబు, టాలీవుడ్ స్టార్స్ ను పట్టించుకోవడం లేదని అంటున్నారు. అయితే, ఫ్యాన్స్ మాత్రం దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఎన్నో సినిమాలకు మహేష్ ప్రమోషన్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: