దేవిశ్రీ ప్రసాద్ కెరియర్ లో ఎందరో టాప్ హీరోలకు సూపర్ హిట్ మ్యూజిక్ తో కూడిన పాటల ట్యూన్స్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ విషయంలో పడుతున్న టెన్షన్ ఇప్పటి వరకు ఏ మూవీ విషయంలోనూ తన కెరియర్ లో పడలేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

‘రంగస్థలం’ మూవీ తరువాత దేవిశ్రీ ప్రసాద్ అనేక సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేసినా ఆ పాటలు ఏమీ పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీనికితోడు దేవిశ్రీ ఇస్తున్న ట్యూన్స్ అన్నీ అతడి పాత పాటల ట్యూన్స్ ను పోలి ఉంటున్నాయి అన్న కామెంట్స్ వస్తూ ఉండటంతో దేవిశ్రీ హవా నెమ్మదిగా తగ్గుతోంది. 

దీనికితోడు సంగీత దర్శకుడు తమన్ తన పాటల ట్యూన్స్ విషయంలో సినిమా సినిమాకు విభిన్నంగా మారుతున్న పరిస్థితులలో ఆ రేంజ్ లో దేవిశ్రీ ప్రతిభ పెద్దగా కనపడటం లేదు అన్న కామెంట్స్ స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో దేవిశ్రీ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ట్యూన్స్ కోసం తన రికార్డింగ్ స్టూడియోలో కొత్త ట్యూన్స్ కోసం ఆలోచన చేస్తున్న సమయంలో ఈ మూవీ సినిమాటోగ్రఫర్ రత్నవేలు తన స్టూడియోకి వచ్చిన ఫోటోను మహేష్ అభిమానులకు షేర్ చేసాడు. 

ఈ ఫోటో షేర్ చేసిన కొద్ది సేపటికే ఆ ఫోటో వైరల్ గా మారడమే కాకుండా దేవిశ్రీని ‘అన్న’ అని సంబోధిస్తూ మహేష్ అభిమానులు రకరకాల విన్నపాలు చేయడమే కాకుండా ఈ మూవీ పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయి తీరాలి అంటూ అనేక విజ్ఞప్తులను చేసారు. ఈ విన్నపాలు వందల సంఖ్యలో దేవిశ్రీ ప్రసాద్ సెల్ కు మెసేజ్ ల రూపంలో చేరుతూ ఉండటంతో దేవిశ్రీ తెగ మధన పడిపోతున్నట్లు టాక్. అంతేకాదు ఈ మూవీ పాటల క్లిక్ కాకపోతే మహేష్ అభిమానుల టార్గెట్ కు తాను బలి అవ్వడం ఖాయం అన్న టెన్షన్ లో దేవిశ్రీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మితిమీరిన ఒత్తిడి దేవిశ్రీ చేత మరో తప్పటడుగు వేయిస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ పరిస్థితి ఏమిటి అంటూ ఈ మూవీ బయ్యర్లు దేవిశ్రీ తో సమానంగా టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: