ప్రముఖ నటి తాప్సీ.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి కొన్నాళ్ల క్రితం షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ హిందీ ఛానళ్లో ఓ తెలుగు దర్శకుడు పూలు, పళ్లు ఎక్కువగా వాడతారని వ్యంగ్యంగా చెప్పింది. అప్పట్లో ఆ అంశం బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఆ ఇష్యూపై రాఘవేంద్రరావు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.


ఆయన ఏమన్నారంటే.. “ ఇప్పటి వరకూ సినిమాల్లో అన్ని పళ్లూవాడేశాను.. ఒక్క పనస పండు తప్ప.. ఒకసారి ఈ పండు ఏ హీరోయిన్‌ బొడ్డు మీద వేస్తారు? అని అడిగితే నీ బొడ్డుమీదే వేస్తా’నని చెప్పా.. నేను ఏ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈ ప్రశ్న తప్పకుండా అడుగుతారు.


ఎందుకంటే ఆ సన్నివేశాలన్నీ వాళ్ల మనసులో గుర్తుండిపోయాయి. ఎవరైనా అసహ్యించుకుంటే వాటి గురించి అడగరు కదా! ఒకసారి దీనిపై చర్చ పెడితే వెళ్లా.. ‘ఆడవాళ్లపైనే ఎందుకు పళ్లు వేస్తారు’ అని అడిగారు. ‘మగవాళ్లపై వేస్తే బాగుండదు కదా’ అని చెప్పా. అమెరికాలో ఇలాగే అడిగితే వారికి కూడా నా శైలిలో సమాధానం చెప్పా. ‘


విమానం ల్యాండ్‌ కావాలంటే రన్‌వే కావాలి. అలాగే పండు ల్యాండ్‌ కావడానికి కూడా మంచి ప్లేస్‌ ఉండాలి’ అని చెప్పా. ‘మనం చిన్నప్పుడు చదివిన పాఠాలు గుర్తుంచుకోవాలి. చెట్టు నుంచి యాపిల్‌ పండు కింద పడినప్పుడు న్యూటన్‌ గ్రావిటీ సిద్ధాంతాన్ని కనిపెడితే, నేను ఎక్కడ పడాలో కనిపెట్టాను’..


నేను పరిచయం చేసిన తాప్సీ.. ఒక హిందీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సౌత్‌లో కె.రాఘవేంద్రరావు అనే దర్శకుడు ఉన్నారు. ఆయన పళ్లు, పూలు ఎక్కువగా వాడతారు’ అని కాస్త వ్యంగ్యంగా మాట్లాడింది .. అది నేను కూడా విన్నాను.. వినడమేకాదు.. చూశాను కూడా. ఆ హీరోయిన్‌ తాప్సి.


అప్పుడు అలా మాట్లాడినందుకు ఆ తర్వాత వచ్చి సారీ చెప్పింది కూడా. ‘వాళ్లను ఎంటర్‌టైన్‌మెంట్‌ చేయడానికి అలా చెప్పాను తప్ప.. వేరే ఉద్దేశం లేదు’ అని చెప్పుకొచ్చింది. ఇలాంటి వాటిపై ఎవరేమన్నా పట్టించుకోను. నా పని నేను చేసుకుని వెళ్లిపోతా. అంటూ వివరించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.


మరింత సమాచారం తెలుసుకోండి: