యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా
జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న
సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు
జాన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. సినిమాలో
ప్రభాస్ సరసన
పూజా హెగ్దె
హీరోయిన్ గా నటిస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ
సినిమా బడ్జెట్ కూడా 150 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది.
ఇక ఈ
సినిమా మొత్తం
ఇటలీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందట. అంతేకాదు 1970 కాలంలో జరిగే ప్రేమకథగా
జాన్ సినిమా తెరకెక్కుతుంది. ఈ
సినిమా కథ ఇదే అంటూ ఫిల్మ్
నగర్ లో ఓ లైన్ చెక్కర్లు కొడుతుంది. ఓపెన్ చేయగానే
ఇటలీ అబ్బాయి,
ఇండియా అమ్మాయి ప్రేమించుకుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఇండియాకు వెళ్లాల్సి వస్తుంది.
ఆమెను వెతుక్కుంటూ
హీరో కూడా ఇండియాకు వెల్తాడు. ఆమెను వెతుకి పట్టుకునే క్రమంలో
హీరో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అన్నదే
సినిమా కథ అని అంటున్నారు. అయితే లైన్ మరీ అంత కొత్తగా అనిపించలేదు. కాని
పూజా హెగ్దె మాత్రం
జాన్ ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ అని ఇలాంటి సినిమాలో నటించడం తన అదృష్టం అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది.
సాహోతో అంచనాలను అందుకోలేని
ప్రభాస్ ఈ సినిమాతో అయినా తన రేంజ్ కు తగినట్టుగా హిట్ కొడతాడేమో చూడాలి. ఈ సినిమాను కూడా తెలుగు,
తమిళ,
హింది భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
2020 సమ్మర్ లో
జాన్ సినిమా రిలీజ్
ప్లాన్ చేస్తున్నారు. ఈ
సినిమా తర్వాత
ప్రభాస్ కొరటాల శివ డైరక్షన్ లో ఓ
సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దానితో పాటుగా
సైరా డైరక్టర్ సురేందర్ రెడ్డితో కూడా
ప్రభాస్ మూవీ డిస్కషన్స్ లో ఉందట.