భీష్మ
మూవీ కి సంబందించిన ఫస్టు గ్లింప్స్ పేరుతో నిన్న ఒక టీజర్ రిలీజ్ అయింది. అయితే ఆ టీజర్ లో
నితిన్ రష్మిక మందన్న వెనుక నడుస్తూ ఆమె నడుమును పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా నడుస్తూ ఉన్నపుడు
రష్మిక హఠాత్తుగా వెనుక్కి తిరగడంతో
నితిన్ చేతులు ఆమె నడుముని తాకుతాయి.
రష్మిక ఏంటి అన్నట్లు సైగచేస్తే
నితిన్ చించేశారు అని సైగ చేస్తూ చెప్పడంతో ఈ టీజర్ ముగిస్తుంది.
ఈ టీజర్ విడుదలైన కేవలం ఒక రోజైనప్పటికీ 23 లక్షల పైన వ్యూస్ 77 వేల లైక్స్ తో
యూట్యూబ్ ట్రేండింగ్ లిస్ట్ లో నెంబర్. 1 స్థానంలో ఉండటం గమనార్హం. అయితే ఇంతగా ట్రెండ్ అవుతున్న టీజర్ ని నాగబాబు కుమారుడేనా
వరుణ్ తేజ్ కూడా చూసాడు..
చూసిన ఈ 'గద్దెల కొండ గణేష్' నటుడు మెగా
ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ
రష్మిక నడుము వీడియో గురించి సోషల్
మీడియా లో కామెంట్ చేసాడు. "మీ లుక్స్ డామ్ క్యూట్ గా ఉన్నాయి. మీరిద్దర్ని కలిపి చూస్తుంటే చాలా బాగుంది. మీరిద్దరూ కూడా చాలా అందంగా ఉన్నారు." అంటూ
వరుణ్ తేజ్ ట్విట్టర్ లో కామెంట్ చేసారు. దీనికి
రష్మిక స్పందిస్తూ.. థాంక్ యు సార్ అంటూ నవ్వుతూ ఉన్న స్మైలీ తో రిప్లై పెట్టారు.
దిల్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా పూర్తివుతున్నట్లు సమాచారం. టీజర్ తోనే ఒక పెద్ద సంచలనం లేపిన ఈ
రొమాంటిక్ సినిమా..
హీరో నితిన్ కి ఒక మంచి కంబ్యాక్ అవుతుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
రష్మిక మందన్న ఈ సినిమాకే పెద్ద హైలైట్ అని.. ఆమె నటించిన ప్రతి
సినిమా హిట్ అయినట్టే.... భీష్మ కూడా మంచి విజయం సాధిస్తుందని
నితిన్ అభిమానులు ధీమాగా ఉన్నారు.