మెగాస్టార్ చిరంజీవి 152 వ చిత్రం కొరటాల దర్శకత్వంలో వస్తున్న సంగతీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంభందించి చిత్ర యూనిట్ హీరోయిన్స్ ను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు సహా కాస్టింగ్ సెలక్షన్ జరుగుతోంది. ఇప్పటికే అజయ్ - అతుల్ ద్వయం సంగీతం అందిస్తారని ప్రచారమవుతోంది. అలాగే ఈ చిత్రంలో ఒక కథానాయిక గా త్రిషను ఫైనల్ చేశారని గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు స్కోప్ ఉంది. రెండో నాయిక కోసం కొరటాల కసరత్తు చాలా సీరియస్ గా సాగుతోందట. చిరు ఇమేజ్ కి తగ్గ కథా నాయికలు అంటే నయనతార.. కాజల్.. తమన్నా ఆ రేంజు వారినే పరిశీలించాల్సి వస్తోంది. అయితే వీళ్లలో ఎవరినీ రిపీట్ చేసే ఆలోచన కొరటాలకు లేదట.


సైరా నరసింహా రెడ్డి సినిమాలో నయనతార .. తమన్నా కనిపించారు. మళ్ళీ వీరిని రిపీట్ చేస్తే సినిమాలో ఫ్రెష్ నెస్ ఉండదని కొరటాల భావిస్తున్నారు.  కాజల్ అంతకుముందే ఖైదీనంబర్ 150లో నటించింది. అందుకే వీళ్లలో ఎవరినీ కాకుండా మరో కొత్త స్టార్ కావాలని పట్టుబడుతున్నారట. పైగా ఆ స్టార్ ఇమేజ్ పైన చెప్పిన ఆ మూడు పేర్ల స్థాయిలో ఉండాలన్న ప్లాన్ ఉందట.అయితే వెతక బోయిన తీగ కాలికి తగిలినట్టు ... బొమ్మరిల్లు హాసిని అయితే బావుంటుందని కొణిదెల బృందం భావిస్తోందట. దర్శకనిర్మాతలు కొరటాల-చరణ్ ఇప్పటికే జెనీలియాని సంప్రదించే పనిలో ఉన్నారని తెలుస్తోంది.


జెనీలియా చేస్తే కొంటితనం ... చిలిపితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పాత్రకు తగ్గట్టు జెనీలియా అయితే ఖచ్చితంగా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.  ఒకవేళ ఇద నిజమైతే హానిని ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరుగుతుందనడంలో సందేహం లేదు. రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లాడి ఇద్దరు పిల్లలకు మామ్ అయిన జెనీలియా సరైన రీఎంట్రీ కోసం చాలా కాలంగానే వేచి చూస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఏకంగా మెగా ఆఫర్ తనని వెతుక్కుంటూ వెళుతోంది అంటే అది లక్కీ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: