బాహుబలి .. మన తెలుగు సినిమా ఇండియన్ సినిమాకు ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. సినిమాలో భారీతనం , కట్టిపడేసే యాక్షన్ సీన్స్ వెరసి సినిమా ఒక కళాఖండంగా మారింది. అయితే ఈ సినిమాను బీట్ చేయడానికి చాలా మంది ప్రయత్నించిన కుదరలేదు. తమిళంలో ‘పులి’ అలాంటి ప్రయత్నమే. కానీ అది డిజాస్టర్ అయింది. సీనియర్ దర్శకుడు సుందర్ ‘సంఘమిత్ర’ పేరుతో ‘బాహుబలి’ని మించే సినిమా తీయాలనుకున్నాడు. వర్కవుట్ కాలేదు. జానర్ వేరైనప్పటికీ ‘2.0’తో ‘బాహుబలి’ని బీట్ చేయాలని చూశాడు శంకర్. కానీ అదీ ఫలితాన్నివ్వలేదు. బాలీవుడ్లో కూడా ఇలాంటి భారీ ప్రయత్నాలు జరిగాయి. తెలుగులో ‘సాహో’, ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి సినిమాలు కూడా ‘బాహుబలి’ని టార్గెట్ చేసినవే.


ఎందుకో గాని బాహుబలి సినిమా క్రియేట్ చేసిన అనుభూతిని ఇవ్వలేకపోయాయి.  కానీ.. ఆ స్థాయి అనుభూతిని మాత్రం ప్రేక్షకులకు ఇవ్వలేకపోయాయి. విజయాలూ సాధించలేకపోయాయి. అయినప్పటికీ ‘బాహుబలి’ తరహా భారీ ప్రయత్నాలు మాత్రం ఆగట్లేదు.ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సైతం ‘బాహుబలి’ లైన్లోనే తన కొత్త చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చారిత్రక నవల ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా మణిరత్నం తన కొత్త చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే.


అయితే ఈ సినిమా కోసం త్వరలోనే చిత్ర యూనిట్ థాయిలాండ్‌ అడవుల్లోకి వెళ్లనున్నది. ఈ సినిమా కోసం ఏడాదిగా ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపోని భారీతనం, కాస్టింగ్, ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను రూపొందించనున్నాడట మణిరత్నం. అంతే కాదు.. ‘బాహుబలి’ లాగే రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతుందట. మరో నిర్మాతతో కలిసి సొంత నిర్మాణ సంస్థలో మణిరత్నం ఈ చిత్రం చేయనున్నాడు. చోళుల కాలం నాటి ఒక రాజు కథతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: