హిందీ లో ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్
పతి షో లో ఛత్రపతి శివాజీ ను అవమానపరిచారని నెటిజెన్స్ త్రీవ ఆగ్రహం వ్యక్తం చేయడంతో
సోనీ టీవీ దిగొచ్చి క్షమాపణలు చెప్పింది.
ఇక వివరాల్లోకి వెళ్తే నవంబర్ 6 న ప్రసారం అయిన కేబీసీ ఎపిసోడ్లో మొఘల్ సామ్రాట్ ఔరంగజేబ్కు సమకాలికుడు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అవి a)మహారాణా ప్రతాప్, b)మహారాజా రంజిత్ సింగ్, c)రాణా సంగా, d)శివాజీ అయితే మొదటి ముగ్గురి రాజుల పేర్లకు ముందు వారి బిరుదులను చేర్చి శివాజీ పేరు ముందు బిరుదును చేర్చలేదు. దీనిపై నెటిజన్లు త్రీవ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది.. ఆయనకున్న బిరుదుతో కలిపి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ అని ఆప్షన్ ఇవ్వకుండా అవమానించారని నెటిజెన్స్
సోనీ టీవీ ను తప్పు పట్టారు.
ఔరంగజేబు చేత శివాజీ దక్షిణ భారత సింహం అనిపించుకున్నాడని, అదీ ఆయన గొప్పతనమని ఒక నెటిజెన్ కామెంట్ చెయ్యగా హిందూ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించిన వీరుడిని అగౌరవపరచడం అవమానకరమని, దీనివల్ల భవిష్యత్ తరాలకు ఏం నేర్పుతున్నామని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు హిందూ దేవాలయాలను కూల్చేసిన ఔరంగజేబుకు మెఘల్ సామ్రాట్ అనే బిరుదును ఎలా పెట్టారని
సోనీ టీవీ ని ప్రశ్నించారు. ఇలా నెటిజెన్స్ తమదైన రీతిలో
సోనీ టీవీ కి చుక్కలు చూపించారు. ఇంతటితో ఆగకుండా
ట్విట్టర్ లో బొయికాట్ కేబీసీ షో, బొయికాట్
సోనీ టీవీ అంటూ ట్వీట్స్ పెట్టి
సోనీ టీవీ దిగివచ్చేలా చేశారు. చేసేదేమీ లేక
సోనీ టీవీ వెంటనే స్పందించి మరుసటి రోజునే (నవంబర్ 7) కేబీసీ ప్రోగ్రాం సమయంలో క్షమాపణలు చెబుతూ స్క్రోలింగ్ రన్ చేయడం జరిగింది.