మహేష్ బాబు హీరోగా 'సరిలేరు నీకెవ్వరూ'
సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ
సినిమా పనులు శరవేగంగా సాగుతూ
సంక్రాంతి కానుకగా మన ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో
సినిమా పనుల్లో బిజీబిజీగా ఉన్న
మహేష్ తన
ట్విట్టర్ అకౌంట్ ద్వారా
కమల్ హాసన్ పుట్టినరోజు వేడుక సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపాడు.
అలాగే ఇండస్ట్రీలో తనకెంతో సుపరిచితమైన, దగ్గరి స్నేహితులు అయిన వారిలో
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు. ఇద్దరు కలిసి 'అతడు' లాంటి
బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తరువాత 'ఖలేజా' లాంటి ఫ్లాప్ వచ్చినా మంచి స్నేహితులు గానే ఉన్నారు. అయిన అదేరోజు
త్రివిక్రమ్ పుట్టినరోజు అయినప్పటికీ
మహేష్ నుంచి ఎటువంటి స్పందన లేదు.
ఏళ్ళు గడిచేకొద్దీ వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. మధ్యలో కొన్నిసార్లు వీరిద్దరి కలయికలో ఒక
సినిమా కోసం ప్రొడ్యూసర్లు తీవ్రంగా ప్రయత్నించినా చివరికి అవేవి ఫలించలేదు. మైత్రి
మూవీ మేకర్స్ వారు
మహేష్ మరియు
త్రివిక్రమ్ కలయికలో ఒక
మూవీ ప్లాన్ చేసినా అదీ వర్క్ అవుట్ కాలేదు.
దీంతో ఆ దూరం మరింత పెరుగుతూ వచ్చిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదు సరికదా వచ్చే సంక్రాంతికి రాబోయే
మహేష్ 'సరిలేరునికెవ్వరూ',
త్రివిక్రమ్ 'అలా వైకుంఠపురం లో' సినిమాలు ఒకే రోజున ఢీ కొనే దాకా వచ్చింది. నిజానికి త్రివక్రమ్
మహేష్ తో
సినిమా చేసేందుకు సముఖంగా లేడని ముందరి నుంచీ టాక్ ఉంది. అందుకే
మహేష్ బాబు తన ఇగో తో కావాలని తన సినిమాని కూడా అదే రోజు విడుదలకి సిద్ధం చేశాడని సినీ వర్గాల్లో వినికిడి.
సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం ఇదే టాపిక్ చర్చగా మారి
మహేష్ పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు ఎంతో అప్పుడైన
త్రివిక్రమ్ గురించి
మహేష్ మాట్లాడకపోవడం ఏంటిఅంటూ నెటిజన్లు ఆశ్చరం వ్యక్తపరుస్తున్నారు. వీరిద్దరి కలహం ఎప్పటికి విడుతుందో, కలిసి ఎప్పుడు
మూవీ తీస్తారో చూడాలి.