ఇష్టం సినిమాతీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన
శ్రియ శరణ్ దాదాపుగా రెండు దశాబ్దాల నుండి తెలుగు,
తమిళ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. అయితే సీనియర్
హీరోయిన్ అవడంతో శ్రియకు కాస్త
సినిమా ఛాన్స్ లు తగ్గాయి. వయసుకు తగ్గ పాత్రలు సెలెక్ట్ చేసుకుంటు సాగుతున్న
శ్రియ కు మరో మంచి ఆఫర్ తన చేతిలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగులో
శ్రియ ఇప్పటి కే
వెంకటేష్ కు జోడీగా సుభాష్
చంద్రబోస్, గోపాల గోపాల సినిమాల్లో నటించింది. ఇప్పుడు మరోసారి వెంకీకి జోడీగా నటించే అవకాశం దక్కించుకున్నట్లు లేటెస్ట్ న్యూస్.
తమిళంలో సెన్షేషనల్
సక్సెస్ అందుకున్న
అసురన్ ను తెలుగులో
రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన
రీమేక్ ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహించబోతున్నారనే విషయంలో ఇంకా క్లారిటి లేదు. అయితే ఈ సినిమాలో
హీరోయిన్ గా శ్రియను
నిర్మాత సురేష్ బాబు సంప్రదించినట్లుగా తాజా సమాచారం. మంచి ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న
శ్రియ వెంటనే ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
వెంకటేష్ - శ్రియలు కలిసి నటించిన రెండు సినిమాల్లో సుభాష్
చంద్రబోస్ ఫ్లాప్ అవ్వగా.. గోపాల గోపాల
సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే వీరిద్దరి జోడీకి క్రేజ్ బాగానే ఉంది. అందుకే మరోసారి వీరి కాంబో అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే ఉంది. ఇక దర్శకుడెవరన్నది అఫిషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత
హీరోయిన్ ని ప్రకటిస్తారట. ప్రస్తుతం
వెంకీ మామ
సినిమా ఫైనల్ షూట్ లో పాల్గొంటున్న
వెంకటేష్ అది పూర్తి చేసి
అసురన్ రీమేక్ లో నటించబోతున్నాడు.