టాలీవుడ్ లో తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించిన
హీరోయిన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు
రష్మిక మందన. చలో సినిమాతో
టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు వరుస విజయాలతో దూసుకుపోతుంది. మొదటి సినిమానే మంచి హిట్ తో ప్రారంభించింది రష్మికా మందన్న. ఇక ఆ తర్వాత
విజయ్ దేవరకొండ నటించిన
గీత గోవింద సినిమా తో
రష్మిక క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే తాజాగా
రష్మిక మహేష్ బాబు సరసన చాన్స్ కొట్టేసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో
మహేష్ కు జోడీగా నటిస్తోంది. అయితే రీసెంట్ గా
రష్మిక మందన
ఇంస్టాగ్రామ్ లో తన చిన్నప్పటి ఫోటోలను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే
రష్మిక పోస్ట్ చేసిన ఫోటోలు క్షణాల్లో అందరిని ఆకర్షించాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు సినీతారలు ట్రోల్ చేస్తూ ఉండడం కామనే . అసభ్యకర కామెంట్లు పెడుతు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.
తాజాగా అందాల ముద్దుగుమ్మ
రష్మిక కి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. ఇటీవలే
రష్మిక మందన తన చిన్ననాటి ఫొటోలను అభిమానులతో పంచుకోగా ఈ ఫోటో పై రకరకాల ట్రోల్స్ రావడం మొదలయ్యాయి. అయితే
రష్మిక చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ 'ఇంత చిన్న పిల్ల పెద్ద ఇంటర్నేషనల్ హైవే అవుతుందని ఎవరు మాత్రం ఊహించారు' అంటూ కొన్ని అసభ్యకరమైన కామెంట్ లు పెట్టాడు ఓ నెటిజన్ . తనపై వచ్చిన ట్రోల్స్ చూసిన
రష్మిక ఇంస్టాగ్రామ్ వేదిక నెటిజన్ల పై ఘాటుగానే స్పందించింది. తన గురించి ట్రోల్స్ చేస్తున్న వారందరికీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది రష్మిక. నటీనటులను ట్రోల్స్ చేయడం ద్వారా నెటిజన్లకు ఏమొస్తుందో నాకు తెలియడంలేదు. మేము ఏమీ అనము కదా అని మమ్మల్ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తుంటారు .
సెలెబ్రిటీలం అయినంత మాత్రాన మా గురించి ఎంతో నిర్దాక్షిణ్యంగా మాట్లాడడం సరికాదంటూ
రష్మిక మండిపడింది. నెటిజన్లు చాలామంది చెబుతుంటారు అసభ్యకరమైన పోస్టులు పట్టించుకోవద్దని... మీరు మా పని గురించి ట్రోల్ల్స్ చేయండి కానీ మా వ్యక్తిగత విషయాలు కుటుంబం గురించి ట్రోల్స్ చేసే హక్కు మీకు లేదు అంటూ నెటిజన్లపై ఫైర్ అయ్యింది రష్మిక. నటీ నటులపై ఇలాంటి ట్రోల్స్ రాకూడదు. నటీనటులు కావడం అంత సులభం కాదు. ప్రతి వృత్తిలో గౌరవం ఉంటుందని తెలిపిన రష్మిక... ప్రతి ఒక్కరు గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది ట్రోల్స్ చేసిన వారిపై మండిపడింది.
రష్మిక ప్రస్తుతం
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించడంతో పాటు
నితిన్ భీష్మ సినిమాలో నటిస్తోంది.