మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా హరీష్ శంకర్ డైరెక్షన్ లో గద్దల కొండ గణేష్ తో మంచి కమర్షియల్ సక్సస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. డిఫ్రెంట్ మేకోవర్ తో మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ వరుణ్-పూజా తో రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సాంగ్ ఫిదా పిల్ల సాయి పల్లవి ధనుష్ రౌడీ బేబీ సాంగ్ ని బీట్ చేయడం విశేషం. ఇక వరుణ్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడు. ఈ సినిమాలో వరుణ్ సరసన కియారాని అనుకున్నారు. 

ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ లేని కియారా అద్వానీ బాలీవుడ్‌లో మాత్రం స్టార్ హీరోయిన్ గా క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. బాలీవుడ్ లో కేవలం ఒకే ఒక్క సినిమా ఆమె లైఫ్‌ని మార్చేసింది. కబీర్ సింగ్ లాంటి బోల్డ్ సినిమాతో ఊహించనంతగా ఫేమస్ అయిన కియారా అద్వానీ ఇప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆమె డేట్స్ కావాలంటే కొన్ని నెలలు వరకు ఆగాల్సిందే. అంత క్రేజ్‌తో కియారా ఉంది. అయితే తాజాగా కియారా అద్వానీని తెలుగులో వరుణ్ తేజ్ సరసన ఓ క్రీడా నేపథ్యం ఉన్న సినిమా కోసం సంప్రదించారని గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. 

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు వరుణ్ తేజ్ బాక్సింగ్ ట్రైనింగ్ కూడా పూర్తవడంతో హీరోయిన్‌ని ఫైనల్ చేసి సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం రెడీ అవుదామనుకుంటే కియారా అద్వానీని సంప్రదించిన వారికీ డేట్స్ సర్దుబాటు చేసుకుని చెబుతా అందట. కానీ కియారా డేట్స్ సర్దుబాటు చేసుకుని వరుణ్ తేజ్ కోసం రావాలంటే ఇంకా టైం పడుతుండడంతో వరుణ్ తేజ్ తన కోసం ఆగాల్సిన అవసరం లేదని.. ఇంకొక హీరోయిన్‌ని చూడమని చిత్ర బృందానికి చెప్పినట్టు తాజా సమాచారం. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న సినిమా అన్ని రెడీ అయినా.. హీరోయిన్ కోసం వెయిట్ చేయడం ఎందుకని చిత్ర యూనిట్ ఇంకో క్రేజీ హీరోయిన్ ని ట్రై చేస్తున్నారట. మొత్తానికి మెగా హీరో ఛాన్స్ ని మిస్సయింది కియారా అని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: