తమిళ నటుడు కార్తీ ఇటీవల గత కొద్దికాలంగా సరైన సక్సెస్ లు లేక, కెరీర్ పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఆయన హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ఖైదీ. ఏ ముహూర్తాన ఈ సినిమాకు ఒకప్పటి మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా పేరు పెట్టారో కానీ, ఈ సినిమా రిలీజ్ అయిన తొలిరోజు తొలిఆట నుండి అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా ఈ సినిమా కలెక్షన్ల దుమ్ము దులుపుతోంది. ప్రత్యేకంగా కామెడీ సీన్స్, హీరో ఎలివేషన్ సీన్స్ మరియు రొమాంటిక్ సన్నివేశాలు వంటివి ఏమి లేకుండా, కేవలం కథ మరియు కథనాలే ప్రధాన బలంగా సాగిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. 

ఇక మొత్తం నైట్ ఎఫెక్ట్ లో కేవలం ఒక రాత్రి జరిగే కథగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయనకు హీరోయిన్, మరియు పాటలు కూడా లేకపోవడం విశేషం. నిజానికి ఇటువంటి అంశాలు ఏవి లేకుండా కూడా ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో దర్శకుడు లోకేష్ ఈ సినిమాను ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ముందుకు తీసుకెళ్లి, నూటికి నూరు మార్కులు సంపాదించారు. ఇక నేటితో ఈ సినిమా రూ.75 కోట్ల మార్క్ కలెక్షన్ దాటి ముందుకు దూసుకెళుతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే సినిమా రిలీజ్ అయి దాదాపుగా పదిహేను రోజులు అవుతున్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఈ సినిమాకు చాలా బాగా కలెక్షన్ వస్తుండడంతో బయ్యర్లు సైతం ఎంతో షాక్ కి గురవుతున్నారట. 

అయితే దానికి ఒక కారణం కూడా ఉందట అదేమిటంటే, వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ రోజున ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన బిగిల్ సినిమా కూడా రిలీజ్ అయినప్పటికీ, టాక్ పరంగా ఖైదీకి సూపర్ రెస్పాన్స్ రావడంతో, మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమానే తమ మొదటి చాయిస్ గా ఎంచుకుంటున్నారట. మరి ప్రస్తుతం మంచి ప్రేక్షకాదరణ మరియు కలెక్షన్ తో దూసుకుపోతున్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో ఇంకెంతమేర కొల్లగొడుతుందో చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: