తెలుగు పరిశ్రమలో బాగా వినిపించే పేరు సమంత అక్కినేని.. ఎం మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమాతో అరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ.. ఆ తరువాత ఒక్కో సినిమాలో నటిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. అలా సినిమా సినిమాకు కొత్తగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. చాలా మంది సరసన నటించి మంచి పేరు సంపాదించింది. ఆ విదంగా ఆమె సక్సెస్ ను అందుకుంది. 
 
మాములుగా  పెళ్లయ్యాక చాలా మంది సినిమాలకు దూరమవుతారు. ఇల్లు సంసారం పిల్లా, పాపలతో జీవించాలని చాలా మంది అనుకోని సినిమాలకు పూర్తిగా దూరమవుతారు. అలాంటిది అక్కినేని కోడలైన సమంత సినిమాలకు మరింత దగ్గరయ్యారు. ఆమె సినిమాలకు బాగానే ఒప్పుకుంది. ముందు కన్నా కూడా పెళ్లైయ్యాక సినిమాలు ఎక్కువగా చేస్తూ వస్తుంది. 


పెళ్లైయ్యాక సామ్ చేసిన సినిమాలు రంగస్థలం, మజిలీ, యూ టర్న్, ఓ బేబీ సినిమాలు చేసింది. ఈ సినిమాలన్నీ ఒక్కొక్కటి ఒక్కోవిదంగా ఉన్నాయి. ఆ సినిమాలన్నీ టాలీవుడ్ లో బాగా హిట్ అయ్యాయి. ప్రేక్షకుల మనసులో ఆ సినిమాలన్నీ బాగా చెరగని ముద్ర వేసుకుంది. ఇకపోతే ఈమెతో ఏ డైరెక్టర్ సినిమా తో సినిమా చేసిన కూడా ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. 



ఇది ఇలా ఉండగా సామ్ సినిమాలకు కొద్దీ సంవత్సరాలు దూరంగా ఉండాలని అనుకుందట.. కొంచం కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న సామ్ ఇప్పుడు లాంగ్ గ్యాప్ తీసుకోవాలని అనుకుందట. దానితో ఈ అమ్మడు ప్రస్తుతం నటిస్తున్న శర్వా సినిమా 96 రీమేక్ తరువాత మరో సినిమాకు సైన్ చేయలేదు దీని కారణంగా ఇలా ఆలోచిందించిందనే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. మరో విషయమేంటంటే సామ్ పిల్లలను కనాలని ఆలోచనతో సినిమాలకు దూరంగా ఉండాలనుకుండానే వార్తలు గట్టిగానే వినపడుతున్నాయి. ఈ విషయం పై క్లారిటీ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: