టాలీవుడ్ స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే
హీరోయిన్ గా గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల పై మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్
మూవీ అల వైకుంఠపురములో. అల్లు
అర్జున్ ఒక
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో నటిస్తున్న ఈ
సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు సాంగ్స్ ఇప్పటికే
యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన అందుకోవడంతో పాటు అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ తో దూసుకుపోయిన విషయం తెలిసిందే. ఎస్ ఎస్ థమన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాకు పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తుండగా,
నవీన్ నూలి ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలోని సామజవరగమనా అనే మెలోడీ సాంగ్ ఎంత పెద్ద పాపులర్ అయిందో మనకు తెలిసిందే. ఇక ఈ సాంగ్ ఫుల్ వీడియోని అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నాం అంటూ మొన్న బన్నీ ఆ సాంగ్ విజువల్ పిక్ ఒకటి తన సోషల్
మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. అయితే ఆ ఫోటో ఉన్న ట్వీట్ ని ట్యాగ్ చేసిన కన్సొలేట్ జనరల్ అఫ్
ఫ్రాన్స్, బెంగుళూరు వారు, మాంట్ సెయింట్ మైకేల్ ప్రాంతంలో షూటింగ్ జరిపిన అలవైకుంఠపురములో న్యూ పోస్టర్ చాలా బాగుంది,
ఆ సాంగ్ కోసం ఆ సినిమా టీమ్ కి వీసాలు జారీచేసినందుకు సంతోషిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు. దీనిపై
అల్లు అర్జున్ కూడా వారికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెల్పుతూ రీట్వీట్ కూడా చేయడం జరిగింది. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం పలు సోషల్
మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే రోజురోజుకు మెగా ఫ్యాన్స్ లో మరియు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచిన ఈ సినిమాను
2020 సంక్రాంతి కానుకగా
జనవరి 12న రిలీజ్ చేయబోతున్నారు.
మురళి శర్మ,
సుశాంత్,
నివేత పేతురాజ్, జయరాం,
నవదీప్,
సునీల్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండడం విశేషం......!!