టాలీవుడ్ లో లెక్కల మాస్టార్ సుకుమార్ మూవీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ప్రతి సినిమా ఓ క్యాలికేషన్ తో తీస్తుంటారు. గత ఏడాది సుకుమార్-రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు..రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ 1983 నాటి పరిస్థితులకు అద్దం పడుతున్నట్లు చిత్రీకరించారు. అప్పటి రాజకీయాలు, ఎమోషన్స్, అమాయకమైన ప్రేమ అన్నీ ఎలిమెంట్స్ ఉండేలా సుకుమార్ తెరకెక్కించారు.
ఈ సినిమా మొత్తం రామ్ చరణ్ చెవిట వాడిగా నటించాడు. రాంచరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇక సమంత హీరోయిన్ గా నటించింది. అమాయకురాలిగా.. అందమైన పల్లెటూరి అమ్మాయిగా నటించింది. ఈ మూవీలో జగపతి బాబు ప్రెసిడెంట్ పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించారు. మొత్తానికి ఈ మూవీలో అందరూ తమ నటనతో అబ్బురపరిచారు..సాంగ్స్ ఇప్పటికీ హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం సుకుమార్ బన్నీ 20వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే వీరి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఓ క్రైమ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీలో బన్నీ సరసన హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది.
ఈ మూవీ తర్వాత సుకుమార్ తో రామ్ చరణ్ ఓ మూవీ చేయాలని ప్లాన్ చేశారట. మోహన్ లాల్ నటించిన లూసిఫర్ రిమేక్ తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ భాద్యత సుకుమార్ కి అప్పగించాలని అనుకున్నారట. కానీ ఈ ఆఫర్ సుక్కు సున్కితంగా తిరస్కరించారట. దానికి కారణం..తాను సొంతగా రాసుకున్న మూవీస్ తప్ప రిమేక్ మూవీస్ చేయనని చెప్పినట్లు సమాచారం. మళయాలంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన లూసిఫర్ మూవీకి పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. సుక్కూ కాదనడంతో మరో దర్శకుడికి ఈ మూవీ అప్పగించాలని చూస్తున్నారట రామ్ చరణ్.