టాలీవుడ్ లో లెక్కల మాస్టార్ సుకుమార్ మూవీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.  ప్రతి సినిమా ఓ క్యాలికేషన్ తో తీస్తుంటారు.  గత ఏడాది సుకుమార్-రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు..రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది.  ఈ మూవీ 1983 నాటి పరిస్థితులకు అద్దం పడుతున్నట్లు చిత్రీకరించారు.  అప్పటి రాజకీయాలు, ఎమోషన్స్, అమాయకమైన ప్రేమ అన్నీ ఎలిమెంట్స్ ఉండేలా సుకుమార్ తెరకెక్కించారు.  


సినిమా మొత్తం రామ్ చరణ్ చెవిట వాడిగా నటించాడు.  రాంచరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.  ఇక సమంత హీరోయిన్ గా నటించింది.  అమాయకురాలిగా.. అందమైన పల్లెటూరి అమ్మాయిగా నటించింది.  ఈ మూవీలో జగపతి బాబు ప్రెసిడెంట్ పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించారు.  మొత్తానికి ఈ మూవీలో అందరూ తమ నటనతో అబ్బురపరిచారు..సాంగ్స్ ఇప్పటికీ హైలెట్ గా నిలిచాయి.   ప్రస్తుతం సుకుమార్ బన్నీ 20వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే వీరి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఓ క్రైమ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీలో బన్నీ సరసన హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది. 


ఈ  మూవీ తర్వాత సుకుమార్ తో రామ్ చరణ్మూవీ చేయాలని ప్లాన్ చేశారట.  మోహన్ లాల్ నటించిన లూసిఫర్ రిమేక్ తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.  ఈ  భాద్యత సుకుమార్ కి అప్పగించాలని అనుకున్నారట.  కానీ ఈ ఆఫర్ సుక్కు సున్కితంగా తిరస్కరించారట.  దానికి కారణం..తాను సొంతగా రాసుకున్న మూవీస్ తప్ప రిమేక్ మూవీస్ చేయనని చెప్పినట్లు సమాచారం. మళయాలంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన లూసిఫర్ మూవీకి పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు.  సుక్కూ కాదనడంతో మరో దర్శకుడికి ఈ మూవీ అప్పగించాలని చూస్తున్నారట రామ్ చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: