సంక్రాంతి రేస్ కు రాబోతున్న ‘అల వైకుంఠపురములో’
మూవీ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అన్న విషయాలను పక్కకు పెడితే ఈ
మూవీ ఇప్పటికే కెరియర్ లో ఫెయిల్ అయిన ముగ్గురి భవిష్యత్ పై తీర్పును ఇచ్చే సినిమాగా మారింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ మూవీలో హీరోగా ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన
సునీల్ సుశాంత్ నవదీప్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ముఖ్యంగా
సునీల్ కెరియర్ కు ఈ
మూవీ ఎంతో అత్యంత కీలకంగా మారింది.
హీరో పాత్రలు రాకపోవడంతో
కమెడియన్ గా తిరిగి మారాలని ఇప్పటికే అనేక సార్లు
సునీల్ ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు
సునీల్ కు కలిసిరాలేదు. దీనితో
త్రివిక్రమ్ ఈ మూవీలో
సునీల్ కోసం ఒక ప్రత్యేకమైన
కామెడీ పాత్రను క్రియేట్ చేసి తిరిగి
సునీల్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈమూవీ షూటింగ్ లో
సునీల్ నటిస్తున్నప్పుడు
త్రివిక్రమ్ అనేకసార్లు
సునీల్ వైపు చూస్తూ ‘సహజ సిద్ధమైన నీకామెడీ టైమింగ్ ను మరిచిపోయావా’ అంటూ
త్రివిక్రమ్ అనేకసార్లు
సునీల్ ను ఈమూవీ షూటింగ్ సమయంలో రెచ్చకొట్టాడని
సునీల్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అదేవిధంగా
సుశాంత్ ను తన నటన విషయంలో ఎలా మెరుగు పరుచుకోవాలి అన్న టిప్స్ అనేకం
సుశాంత్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా హీరోగా విలన్ గా ఎన్నో పాత్రలు చేసిన రాణించని
నవదీప్ కు మళ్ళీ విలన్ గా మరో అవకాశం
త్రివిక్రమ్ ఇవ్వడమే కాకుండా
నవదీప్ కు డిఫరెంట్ గా కనిపించదానికి ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ను కూడ
త్రివిక్రమ్ ఈ మూవీలో క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో ‘అల వైకుంఠపురములో’ సక్సస్ కేవలం బన్నీకి మాత్రమే పరిమితం కాకుండా ఇప్పటికే ఫెయిల్యూర్ బ్యాచ్ లో చేరిపోయిన ఈముగ్గురుకి కెరియర్ కు సంబంధించి వేదికగా ‘అల వైకుంఠపురములో’ మూవీని
త్రివిక్రమ్ మార్చాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..