భారతీయ చలన చిత్ర రంగంలో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు మణిరత్నం. ఆయన తీసిన సినిమాలు ఇప్పటికీ..ఎప్పటికీ వెండితెరపై ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటాయి.   సామాజిక పరిస్థితులు,కట్టుబాట్లు,  ప్రేమకథలతో మణిరత్నం సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. అప్పట్లో రోజా,ముంబాయి లాంటి సినిమాలు ఎన్నో వివాదల మద్య రిలీజ్ అయిన విషయం తెలిసిందే. హజత్వానికి చేరువగా పాత్రలు మసలుకుంటూ ఉంటాయి గనుకనే ఆయన సినిమాలు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంటాయి. అలాంటి మణిరత్నం ఈ సారి చారిత్రక నేపథ్యాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నాన్ని చేస్తున్నారు.ఇప్పటి వరకు స్టార్ హీరోలతో మణిరత్నం ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. 

ప్రముఖ నటి సుహాసిని ని వివాహం చేసుకున్నారు.  గత కొంత కాలంగా మణిరత్నం తీస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా నమోదు చేసుకుంటున్నాయి.  హిట్, ఫ్లాప్ లతో ఎలాంటి సంబంధాలు లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు..మణిరత్నం.  ప్రస్తుతం కల్కి విరచిత 'పొన్నియిన్‌ సెల్వన్‌' నవల ఆధారంగా మణిరత్నం మూవీ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా నిర్మాణ పూర్వ పనులు జరుగుతున్నాయి. విక్రం, జయంరవి, కార్తి, మోహన్‌బాబు, ఐశ్వర్యారాయ్‌, కీర్తిసురేష్‌ వంటి భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కించనున్నారు.  చోళరాజుల కాలంనాటి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.

తమిళంలో ఈ సినిమాకి 'పొన్నియిన్ సెల్వన్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 'పొన్నియిన్‌ సెల్వన్‌' తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ థాయ్‌లాండ్‌లో జరుగనున్నట్లు తెలుస్తోంది.   ఈ మూవీలో ఇందులో ఐశ్వర్యారాయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఓ పాత్ర నెగిటీవ్ గా ఉండబోతున్నట్లు  ఆ మద్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ మూవీ డిసెంబరు తొలి వారంలోనే తన బృందంతో కలిసి మణిరత్నం థాయ్‌లాండ్‌ వెళ్లనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెప్పాయి. ఎంజీఆర్‌ వంటి పలువురు హీరోలకు ఇది ఓ పెద్ద కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు మణిరత్నం దానికి కార్యరూపం ఇవ్వడంతో సినీరంగం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మొత్తానికి షూటింగుకు వారం ముందుగానే ఈ సినిమా టీమ్ అక్కడికి చేరుకోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: