నాపేరు సూర్య సినిమా విడుదలకు ముందు వరకు అల్లు అర్జున్ కెరీర్ చాలా విజయవంతంగా కొనసాగింది. చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో పాటుగా నిర్మాతలకు చాలా లాభాలు తెచ్చిపెట్టేవి బన్నీ సినిమాలు. దీంతో అల్లు అర్జున్ తో సినిమా అంటే చాలామంది నిర్మాతలు ఎంతో సంతోషంగా నిర్మించడానికి ముందుకు వచ్చేవాళ్ళు. అయితే తాజాగా మాత్రం నిర్మాతలకు బన్నీ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే గతంలో తాను చేసిన సినిమా విషయంలో నిర్మాతలకు స్వేచ్ఛ ఇస్తూ కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకునేవాడు బన్నీ. అయితే ఈ క్రమంలో తాజాగా తను నటించిన ప్రతి సినిమా నిర్మాతకి గీతాఆర్ట్స్ కి వాటా ఇవ్వాలని అల్లు అర్జున్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.


ఈ క్రమంలో ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న అలా వైకుంఠపురం సినిమా విషయంలో ఇటువంటి ఒప్పందం చేసుకుని హారిక హాసిని సంస్థ తో ఒప్పించి  గీతాఆర్ట్స్ కి వాటా వచ్చేలా అల్లు అర్జున్ ముందే అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఇటువంటి నేపథ్యంలో త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా చివరి దశకు చేరుకున్న ఈ క్రమంలో తర్వాత సుకుమార్ తో చేయబోయే సినిమా నీ నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకి కూడా ఇలాంటి షరతే పెట్టాడు బన్నీ.


ఇందులో గీతాఆర్ట్స్ కి భాగస్వామ్యం ఇవ్వాలని అల్లు అర్జున్ కండీషన్ ఎక్కడంతో నిర్మాతలు ఒక్కసారిగా షాక్ తిన్నారట. అసలే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఇటీవల నిర్మిస్తున్న సినిమాలు వరుసగా నష్టాలు తీసుకు వస్తున్న క్రమంలో..తాజాగా అల్లు అర్జున్ పెట్టిన కండిషన్ కి ఒక్కసారిగా షాక్ తిన్నట్లు..సమాచారం. మరి ఈ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి. మరోపక్క అల్లు అర్జున్ మాత్రం తన తర్వాత చేయబోయే సినిమాల విషయంలో ఇదే పంథా కొనసాగించాలని డిసైడ్ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: