‘బాహుబలి’ తర్వాత అదే స్థాయిలో సూపర్ డూపర్ హిట్ కొట్టాలని భావించిన రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా చేయడం జరిగింది. ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకుంది. తీరా సినిమా విడుదలైన మొదటి షోకే దారుణమైన ఫ్లాప్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానులు మరియు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు నిరుత్సాహం చెందారు. ముఖ్యంగా ప్రభాస్ అయితే ఏకంగా ఈ సినిమా కోసం రెండు సంవత్సరాల పాటు తన టైం కేటాయించడంతో రిజల్ట్ ఒక్క షో కి చాలా దారుణంగా రావడంతో తీవ్రంగా నిరుత్సాహం చెందినట్లు ఫిలింనగర్ లో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం జిల్ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో పాత కాలం నాటి ఒక లవ్ స్టోరీ సినిమా ప్రభాస్ చేస్తున్నారు.


అయితే ఈ సినిమాలో గత సినిమా సాహో సినిమా రిజల్ట్ ఇచ్చిన ప్రభావంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ విషయంలో అనవసరమైన ఖర్చులకు వెళ్లకుండా నిర్మాతలతో ప్రభాస్ డిస్కషన్స్ మరియు కండిషన్స్ పెడుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఇక విషయంలోకి డీటెయిల్ గా వెళితే సాహో పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే జాన్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన ప్రభాస్ బడ్జెట్ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదట. యూరప్ లోని కొన్ని స్పెషల్ లొకేషన్స్ లోనే సినిమా షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నారు. ఇక మొదటి షెడ్యూల్ అయిపోగానే సాహో ప్రమోషన్స్ తో బిజీ అయిన ప్రభాస్ జాన్ కి కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.


ఇక సాహో రిజల్ట్ తో రెబల్ స్టార్ ఆలోచనలు కూడా మారాయి. సెకండ్ షెడ్యూల్ అనంతరం ఇప్పుడు మొత్తం యూరప్ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేశాడట. బడ్జెట్ తో ప్రయోగాలు అనవసరమని రామోజీ ఫిల్మ్ సిటీలోనే యూరప్ కి సంబందించిన సెట్స్ తో మ్యానేజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారట. పెదనాన్న కృష్ణం రాజు బ్యానర్ గోపీకృష్ణ మూవీస్ మరియు యువి క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో ప్రభాస్ ముందుగానే అనవసరపు ఖర్చులు కు వెళ్లకుండా సినిమా ఫస్ట్ నుండి కండీషన్స్ పెడుతున్న నేపథ్యంలో నిర్మాతలు కూడా ప్రభాస్ తీసుకున్న నిర్ణయాలకు షాక్ అవుతున్నారు అని ఇండస్ట్రీ వినబడుతున్న టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: