మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ శిష్యుడు వెంకీ కుడుముల ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. నాగ శౌర్య, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతోనే రష్మిక తెలుగు తెరకు పరిచయమై సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది. ఇక ఈ దర్శకుడు రెండో సినిమాగా భీష్మ అంటూ వస్తున్నాడు.


త్రివిక్రం శిష్యుడు వెంకీ పవన్ అభిమాని నితిన్ తో చేస్తున్న సినిమా ఇది. తనొక హీరో అయినా పవన్ అభిమానిగా చెప్పుకునేందుకు గర్వపడతాడు నితిన్. పవన్ క్రేజ్ తో స్టార్ రేంజ్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నా వర్క్ అవుట్ అవట్లేదు. లవర్ బోయ్ ఇమేజ్ తో కెరియర్ సాగిస్తున్న నితిన్ వెంకీ తో చేస్తున్న భీష్మ సినిమాతో హిట్ కొట్టేలా ఉన్నాడు. 


ఈ కాంబినేషన్ చూస్తుంటే త్రివిక్రం, పవన్ కాంబినేషన్ గుర్తుకొస్తుంది. అయితే వారు గురువులైతే వీరిద్దరు శిష్యులు కావడం విశేషం. ఇలా ఈ కాంబినేషన్ పై ఓ బలమైన ముద్ర పడేలా చేస్తున్నారు. ఈమధ్యనే రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్ అదిరిపోయింది. నితిన్, రష్మిక జోడీ అదిరిపోగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా భీష్మ ప్రేక్షకులను మెప్పించడం పక్కా అంటున్నారు. 


అసలైతే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నా 2020 ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. ఛలో డైరక్టర్ వెంకీ తన మొదటి సినిమా హిట్ అవడంతో ఆ హీరోయిన్ నే రిపీట్ చేయడమే కాకుండా సినిమా రిలీజ్ ను కూడా సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. శ్రీనివాస కళ్యాణం తర్వాత నితిన్ చేస్తున్న ఈ భీష్మ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. భీష్మతో పాటుగా వెంకీ అట్లూరితో రంగ్ దే సినిమా కూడా చేస్తున్నాడు నితిన్. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: