టాలీవుడ్ లో సాఫ్ట్ పర్సన్ గా మహేశ్ కు పేరు ఉంది. ఎటువంటి కాంట్రవర్శీలకు వెళ్లడని అందరితో కలిసిపోతాడని అంటారు. రివ్యూ రైటర్స్ పై వివాదాలకు వెళ్లకుండా ‘నన్ను ఇందులోకి లాగకండి.. వాళ్లకు నచ్చినట్టు వాళ్లు రాసుకుంటారు’ అని తప్పించుకున్నాడు. కానీ ప్రస్తుతం మహేశ్ ని చూస్తుంటే ఏటికి ఎదురీదుతున్నట్టు ఉంది. ఇండస్ట్రీలోని ముగ్గురు టాప్ డైరక్టర్లతో భేదాభిప్రాయాలు కొనితెచ్చుకోవడమే ఇందుకు ఉదాహరణ.

 


రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్ ను సంవత్సరం పాటు తిప్పించాడు మహేశ్. విసుగెత్తిన సుకుమార్ వెంటనే ఆ కథ బన్నీకి చెప్పడం సినిమా అనౌన్స్ చేయడం జరిగిపోయాయి. దర్శకులు కొన్ని నెలలు కూడా ఆగలేకపోతున్నారు అంటూ ఇన్ డైరక్ట్ గా సుకుమార్ మీద డైలాగ్ వేశాడు. మహర్షి ప్రీరిలీజ్ వేదికపై తన కెరీర్లో బెస్ట్ సినిమాలిచ్చిన దర్శకులందరి పేర్లు చెప్పి పోకిరితో సూపర్ స్టార్ ను చేసిన పూరి జగన్నాధ్ పేరు మాత్రం చెప్పలేదు. దీంతో మహేశ్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇస్మార్ట్ శంకర్ సెలబ్రేషన్స్ లో,, ‘మహేశ్ కి హిట్లుంటేనే కనపడతాం.. లేకపోతే పట్టించుకోడు’ అని మహేశ్ నైజాన్ని పూరి బాహాటంగా చెప్పేశాడు. తాజాగా త్రివిక్రమ్ తో ఇష్యూస్ ను తానే బయటపెట్టుకున్నాడు మహేశ్. కమల్ హాసన్ కు బర్త్ డే విసెష్ చెప్పి అదేరోజు పుట్టినరోజు జరుపుకున్న త్రివిక్రమ్ కు మాత్రం విసెష్ చెప్పకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

 


సంక్రాంతికి త్రివిక్రమ్ సినిమాతో పోటీగా అదే రోజు తన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే మహేశ్ అగ్ర దర్శకులతో గొడవలు పెట్టుకున్నాడనే అర్ధమవుతోంది. మహేశ్ కెరీర్ కి ఇది ఎంతవరకూ మైనస్సో చెప్పలేం కానీ.. మహేశ్ వివాదాలకు దూరంగా ఉంటాడు.. అందరికీ గౌరవం ఇస్తాడన్న మాటలు అబద్ధాలని తేలిపోతున్నాయి!

 


మరింత సమాచారం తెలుసుకోండి: