దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ ''అజర్ బైజాన్ రాజధాని బాకులోని బ్యూటీఫుల్ లొకేషన్స్ దగ్గర, సీజీ మౌంటెయిన్స్ దగ్గర, క్యాస్పియన్ సముద్రం దగ్గర '8' రోజుల పాటు ఈ మూడు పాటల్ని చిత్రీకరించాం. హీరో హీరోయిన్పై 'వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే' అనే ఎమోషనల్ గీతాన్ని చిత్రీకరించాం. 'సింగిల్ సింగిల్' అనే పాటను ఫుల్ డ్యాన్స్ నెంబర్గా హీరో, హీరోయిన్, 20 మంది డ్యాన్సర్లపై తీశాం. 'నాతో నువ్వుంటే చాలు' అనే డ్యూయట్ని హీరో - హీరోయిన్, 10 మంది డ్యాన్సర్లపై షూట్ చేశాం. ఈ '3' పాటలకూ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఎక్స్ ట్రార్డినరీగా స్టెప్స్ కంపోజ్ చేశారు. ఈ సినిమాలో ఈ పాటలు మంచి హైలైట్గా నిలుస్తాయి'' అని తెలిపారు.
కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రావు రమేష్, ఆలీ ,పోసాని కృష్ణ మురళి, అజయ్ , ప్రగతి, ప్రవీణ్, కాలకేయ ప్రభాకర్, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రోల్ రిడా, నెల్లూర్ సుదర్శన్, దువ్వాసి మోహన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి. సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె.యువరాజ్, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: జీఎం శేఖర్, పాటలు: చంద్రబోస్, ఫైట్స్: వెంకట్, జాషువా, ప్రొడక్షన్ కంట్రోలర్: కె.సూర్యనారాయణ, నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ, రచన-దర్శకత్వం: శేఖర్ రెడ్డి ఎర్ర .