ప్రిన్స్ మహేష్ బాబుకు మరో ఆప్షన్ లేదు. ఈ స్టార్ హీరో నాన్చుతుండటంతో ఇన్నాళ్లూ క్యూలో ఉన్న డైరెక్టర్స్ అందరూ సైడైపోయారు. దీంతో సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు మరోసారి ఆ డైరెక్టర్ తోనే తర్వాతి సినిమాకు ఫిక్స్ అయిపోయినట్టు సమాచారం. 


సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సరిలేరు నీకెవ్వరు సినిమా పూర్తి కాకుండానే మహేష్ బాబు తర్వాత చేయబోయే సినిమాకు సంబంధించి క్లారిటీ లేకపోవడం వల్లే ప్రిన్స్ తర్వాతి మూవీకి సంబంధించి లేట్ అవుతోందని తెలుస్తోంది. 


నిజానికి మహర్షి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో మహేష్ సినిమా చేయాల్సింది. కానీ ప్రిన్స్ అనిల్ రావిపూడి సిగ్నల్ ఇవ్వడంతో సందీప్ వంగా బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయాడు. అలాగే సుకుమార్ ని వెయిట్ చేయించడంతో బన్నీతో సినిమా చేస్తున్నాడు. ఇక కొరటాల శివ, చిరంజీవితో కమిట్ అయ్యాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ ఎవరూ ఖాళీ లేరు. దీంతో మహేష్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరోసారి నటించాలని నిర్ణయించుకున్నట్టుగా వినిపిస్తోంది. 


మహేశ్ బాబు న్యూ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చి రిస్క్ తీసుకోడు. అందుకే వంశీపైడిపల్లికే మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నట్టు టాక్. ఈ ఏడాది వీరి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి భారీ సక్సెస్ తో కాకపోయినప్పటికీ డీసెంట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు తన బిహేవియర్ తో వంశీపైడిపల్లి, మహేశ్ బాబుకు బాగా దగ్గరయ్యాడు. ఆ క్లోజ్ నెస్ తోనే ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోందని వినికిడి. వంశీపైడిపల్లి ఇప్పటికే ప్రిన్స్ కు స్టోరీ లైన్ చెప్పి ఒకే చేయించుకున్నాడు. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ కాంబినేషన్ పట్టాలెక్కనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: