టాలీవుడ్ లోకి బాలనటుడిగా రంగ ప్రవేశం చేసిన
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు
రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం.1’ మూవీలో నటించాడు. ఈ
మూవీ మంచి హిట్ అయ్యింది..తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో
ఆది సినిమాతో మరో
బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తర్వాత
రాజమౌళి దర్శకత్వంలోనే సింహాద్రి, యమదొంగ సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు ఎన్టీఆర్. ఆ మద్య ఒకటీ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా..టెంపర్, జనతా గ్యారేజ్,జై లవకుశ ఇలా వరుసగా విజయాలు అందుకుంటూ వస్తున్నాడు.
ప్రస్తుతం
రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ మద్య స్టార్ హీరోలు బిజినెస్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మరికొంత మంది హీరోలు నిర్మాణ రంగం వైపు మళ్లారు. ఇప్పటికే
మహేష్ ఎంబీ క్రియేషన్స్ అని ఓ ప్రొడక్షన్
హౌస్ ని స్టార్ట్ చేసి శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం అనే సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం సరిలేరు నికేవ్వరు అనే సినిమాకి వన్ అఫ్ ది
ప్రొడ్యూసర్ గా ఉన్నాడు మహేష్. ఇక
ఖైదీ నెంబర్ 150
మూవీ నుంచి
రామ్ చరణ్ సైతం నిర్మాణ రంగం వైపు దృష్టి పెట్టారు.