ఒక్క హిట్ పడితే చాలు ఏ
హీరోయిన్ అయినా రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తారు. దీన్నే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటారు. ఈ విషయంలో యంగ్ అండ్
బ్యూటీ హీరోయిన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. దర్శక, నిర్మాతలు అవకాశం ఇస్తామని అంటే చాలు పెద్ద కొండెక్కి కూర్చుంటున్నారు. అయితే అసలు కెరీర్ లో వరుసగా రెండు ఫ్లాప్ సినిమాల్లో నటించి రీసెంట్ గా ఒక్క హిట్టు అందుకుంది బెంగళూరు
భామ నిధి అగర్వాల్. అక్కినేని హీరోలు నాగచైతన్య- అఖిల్ సరసన నటించిన మొదటి రెండు సినిమాలు చేసినా గానీ అవి ఈ బ్యూటీకి అసలు కలిసి రాలేదు. అయితే రీసెంట్ గా
రామ్ సరసన
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది.
పూరి మార్క్ మాస్ మూవీగా ఈ
సినిమా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. దాంతో నిధీ కి అవకాశాలు బాగానే వస్తున్నాయి.
ఇక ఇప్పటి వరకు కెరీర్ లో ఫస్ట్ హిట్టు అందుకున్న నిధికి తాజాగా డెబ్యూ
హీరో అశోక్ గల్లా సరసన అవకాశం దక్కింది. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా
నిధి ట్యాలెంట్ ని దృష్టిలో పెట్టుకుని భారీ పారితోషికాన్ని ఇచ్చేందుకు దర్శక, నిర్మాతలు అంగీకరించారట. అందానికి అందం.. గ్లామర్ యాంగిల్ లో ప్రస్తుతం నిధిని కొట్టేవాళ్లే లేరు. ఇస్మార్ట్ లో కూడా అందాల ఆరబోత మోత మోగించింది.
అందాల ఆరబోతకు చిట్టి పొట్టి నిక్కర్లలో హీటెక్కించేందుకు ఏమాత్రం అడ్డు చెప్పని నిధీ సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. తనకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా గల్లా బృందం పిలిచి మరీ ఈ ఛాన్స్ ఇచ్చారట.
మహేష్ మేనల్లుడు
అశోక్ గల్లాని తల్లిదండ్రులు పద్మ గల్లా-జయదేవ్ గల్లా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా లాంచ్ చేస్తున్నారు. ఇక ఈ ఆదివారం
హైదరాబాద్ లో జరుగుతున్న
పూజా కార్యక్రమాలకు భారీగా అతిథుల్ని ఆహ్వానించారు. మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారని తాజా సమాచారం. ఇలాంటి క్రేజీ సినిమాలో నిధికి ఛాన్స్ దక్కడం అదృష్టమే. ఇక మెగా హీరోతో కూడా నటింపజేయడానికి నిధీతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది.