కోలీవుడ్ హీరో విశాల్ నటించే అన్నీ సినిమాలు దాదాపుగా తెలుగు లో విడుదల అయి మంచి
బిజినెస్ ని చేస్తుంటాయి. ఎందుకంటే
విశాల్ ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాలతో వస్తుంటాడు కాబట్టి ఆ
జోనర్ ను ఇష్టపడే ప్రేక్షకులు
విశాల్ సినిమాను మిస్ అవకుండా చూస్తుంటారు. గతంలో
విశాల్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది.
విశాల్ నటించిన ప్రతి సినిమాకు మినిమమ్ రెండున్నర కోట్ల షేర్ వచ్చేది. కానీ ఈ మధ్య
విశాల్ నటించిన సినిమాలలో దాదాపుగా అన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. కంప్లీట్ గా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోతున్నాయి. దీంతో ప్రస్తుతం
విశాల్ మార్కెట్ పూర్తిగా తగ్గిపోయిందని, ఆయన కొత్త
సినిమా యాక్షన్ కు బిజినెస్ జరగడం లేదని లేటెస్ట్ న్యూస్.
విశాల్ నటించిన 'యాక్షన్'
నవంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కనీసం విడుదలకు వారం కూడా లేదు. అయినా
బిజినెస్ కావడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 'యాక్షన్' టీమ్ ప్రమోషన్స్ పై అసలు ఏ మాత్రం ఫోకస్ చేయక పోవడంతో ఈ
సినిమా రిలీజ్ అవుతోందన్న సంగతి కూడా ఎవరికీ పెద్దగా తెలియక పోవడం గమనర్హం. తెలుగులోనే కాదు తమిళంలో కూడా పరిస్థితి ఇలానే ఉందట.
విశాల్ సినిమా కు అక్కడ థియేటర్స్ కూడా దొరకడం లేదని
కోలీవుడ్ మీడియా సమాచారం. అందుకు కారణం
దీపావళి కి రిలీజయిన
విజయ్ 'బిగిల్'.. కార్తీ 'ఖైదీ' సినిమాలు ఇంకా
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతున్నాయట. దీంతో
విశాల్ సినిమాకి తక్కువ థియేటర్స్ దొరికాయట.
మరి ఇలాంటి టైం లో రిలీజ్ అవుతున్న 'యాక్షన్' ప్రేక్షకులను ఎంతమాత్రం మెప్పిస్తుందో చూడాలి. ఖుష్బూ
భర్త సుందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలో
విశాల్ సరసన మిల్కీ
బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. బికినీ యాక్షన్ సీన్స్ అదరగొడుతున్నట్లు ట్రైలర్, పోస్టర్స్ చూస్తే అనిపిస్తుంది. ఇక
ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తుండగా హిప్ హాప్
తమిళ సంగీతం అందిస్తున్నాడు.