విక్రమ్.కె.
కుమార్ పేరు చెప్తే ఆయన గారి చిత్రాల మాటేమోగాని అక్కినేని ఫ్యామిలీకి జీవితాంతం గుర్తుండిపోయే మనం సినిమానే అందరి మనసులో మెదులుతుంది. ఇంతవరకు అలాంటి ఆలోచన మన
టాలీవుడ్ దర్శకులలో ఏ ఒక్కరికి రాలేదు. అందుకే ఇప్పటికి విక్రమ్.కె.
కుమార్ ని
నాగార్జున నెత్తిన పెట్టి చూసుకుంటాడు. అయితే ఈ
డైరెక్టర్ కి మళ్ళీ ఆ స్థాయి సక్సస్ మాత్రం రాలేదు.
తమిళ సూపర్ స్టార్ సూర్య తో 24 తీసినప్పటికి ఆ
సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక ఆర్.ఆర్.ఆర్ తర్వాత
రామ్ చరణ్ నటించే
సినిమా ఏది? దర్శకుడు ఎవరు? అంటే దానికి ఇప్పటి వరకూ సరైన సమాధానం రావడంలేదు. చెర్రీతో సినిమాలు చేయాలని త్రివిక్రమ్..
కొరటాల తో సహా పలువురు సీనియర్ దర్శకులు చాలా రోజులుగా ఎదురు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ ఇద్దరు టాప్ డైరెక్టర్లు స్క్రిప్టులు వినిపించి రెడీగా ఉన్నారు. అయితే
చరణ్ మాత్రం ఇంకా ఎవరికి కాల్షీట్లు కేటాయించలేదు. ప్రస్తుతం ఆయన
ఆర్.ఆర్.ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా క్రియేటివ్
డైరెక్టర్ విక్రమ్.కె.
కుమార్ చరణ్ ని కలిసి ఓ స్క్రిప్ట్ వినిపించాడని ఫిల్మ్
నగర్ లో ప్రచారమవుతోంది. కానీ
చరణ్ ఓకే చేశారా లేదా? అన్నది ఇంకా తెలియలేదు. అంతేకాదు
విక్రమ్ కె.కుమార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెగా
పవర్ స్టార్ అవకాశం ఇస్తాడా? అన్నది కాస్త అనుమానంగానే ఉంది. రీసెంట్గా
నేచురల్ స్టార్ నానితో 'నానీస్ గ్యాంగ్ లీడర్' తెరకెక్కించాడు విక్రమ్.
కానీ ఆ
సినిమా అంచనాలను తారుమారు చేస్తు డిజాస్టర్గా మిగిలింది. అటు బన్నీ కూడా 'నా పేరు సూర్య' తర్వాత విక్రమ్.కె తో
సినిమా చేయాలనుకున్నప్పటికి కమర్శియల్
డైరెక్టర్ కాదన్న కారణంగా చివరి నిమిషంలో ప్రాజెక్ట్ కి నో చెప్పాడు. మరి ఇన్ని కారణాల తో
చరణ్ రిస్క్ తీసుకుంటాడా? అంటే లేదు అన్న సమాధానమే వినిపిస్తుంది. ఇకపోతే
రామ్ చరణ్ త్రివిక్రమ్-కొరటాలతో పాటు
సుకుమార్ తోనూ ప్రాజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య ఈ ముగ్గురు దర్శకుల పేర్లు ఫిల్మ్
నగర్ లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో విక్రమ్.కె కి
చరణ్ తో
సినిమా చేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది స్క్రిప్టు ను బట్టి ఉంటుందని తెలుస్తుంది.