అదేంటో గాని ఇండస్ట్రీలో లక్కీ
హీరో అనరు. లక్కీ
హీరోయిన్ అని మాత్రం పదే పదే జపం చేస్తుంటారు. టాలెంట్ ఎంత ఉన్నా హీరోయిన్ల సెలెక్షన్ విషయంలో ముందుగా చూసేది లక్కే. ఆ లక్ ఉన్న
హీరోయిన్స్ చుట్టూనే దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతుంటారు. ప్రస్తుతం
టాలీవుడ్ లో అలా లక్కీ
హీరోయిన్ అనిపించుకొని పెద్ద సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది రశ్మిక మందన్న. యంగ్
హీరో నాగ శౌర్య్య సరసన 'ఛలో' సినిమాతో
టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి
సక్సెస్ అందుకున్న
రష్మిక ఆ తర్వాత 'గీత గోవిందంతో'
బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
అయితే 'గీత గోవిందం' తర్వాత బ్యూటీకి ఇంక తిరుగులేదనుకునే లోపే 'దేవదాస్','డియర్ కామ్రేడ్' సినిమాలతో వరుసగా రెండు ఫ్లాపులు పడ్డాయి. అయితే ఆ సినిమాలు లెక్కచేయకుండానే వరుసగా రష్మికకు పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం
నితిన్ తో 'భీష్మ' చేస్తున్న రశ్మిక మరో వైపు 'సరిలేరు నీకెవ్వరు'లో
మహేష్ సరసన నటిస్తుంది. ఇక లేటెస్ట్ గా
అల్లు అర్జున్ 20 సినిమాలో కూడా ఛాన్స్ అందుకొని మా దగ్గర లేనిదేంటి తన దగ్గర ఉందేంటి అన్న రేంజ్ లో మిగతా
హీరోయిన్స్ కి షాకిచ్చింది.
ఇక
రష్మిక నటిస్తున్న ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. అయితే వీటిలో ముందుగా 'సరిలేరు నీకెవ్వరు' రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత 'భీష్మ' ఇక ఏడాది చివర్లో లేదా 2021 లో బన్నీ
సుకుమార్ సినిమా రిలీజ్ అవుతుందట. ఈ మూడు సినిమాలతో ఈ కన్నడ
బ్యూటీ తెలుగులో మళ్లీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని లక్కీ
హీరోయిన్ అనిపించుకొని స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంటుందా..? లేక సర్దుకొని ఇంటికెళుతుందా..? చూడాలి. ఇక
రష్మిక తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది. అడపా దడపా మిగతా భాషల్లో ఒక్కో
సినిమా పడ్డా కూడా రష్మికకి తిరుగుండదని తన అభిమానులు చెప్పుకుంటున్నారు.