టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ మరియు రష్మిక మందన్న కలయికలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ అనే క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ సినిమాను మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 

ఇకపోతే ఈ సినిమా ద్వారా ఒకప్పటి సీనియర్ నటి అయిన విజయశాంతి గారు చాలా ఏళ్ళ తరువాత టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆమెతో పాటు ప్రముఖ కమెడియన్ బండ్ల గణేష్ కూడా చాలా రోజుల తరువాత మళ్ళి సినిమాల్లో నటిస్తున్నారు. ఇక వీరిద్దరితో పాటు కొన్నేళ్ల క్రితం ఖడ్గం, విజయేంద్ర వర్మ, పెళ్ళాం ఊరెళితే, బహుమతి, ఖుషి ఖుషీగా వంటి తదితర సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించిన హీరోయిన్ సంగీత, ఆ తరువాత కొన్నాళ్ళకు వివాహం చేసుకుని టాలీవుడ్ కి దూరం అయ్యారు. అయితే మళ్ళి ఈ సినిమా ద్వారా ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది. 

దర్శకుడు అనిల్ రావిపూడి తనను కలిసి స్టోరీ మరియు అందులో తన పాత్ర రాసుకున్న విధానం నచ్చడంతోనే సరిలేరు సినిమా ఓకె చేశారట సంగీత. ఇక ఈ సినిమాలో ఆమెది ఎంతో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని, విజయశాంతి గారి మాదిరిగానే ఈ సినిమాలో సంగీత క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుందని ఫిలిం నగర్ వర్గాల టాక్. మరి ఇన్ని రకాల ప్రత్యేకతలు మరియు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది......!!


మరింత సమాచారం తెలుసుకోండి: