రానా దగ్గబాటి-గుణశేఖర్ కాంబినేషన్ లో హిరణ్య కశిప అనే సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. భారీ విజువల్ గ్రాఫిక్స్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో డి.సురేష్ బాబు-గుణశేఖర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇక రుద్రమదేవి రిలీజ్ తర్వాత గుణశేఖర్ పూర్తిగా ఈ ప్రాజెక్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. దాదాపు మూడేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ మీదే వర్క్ చేస్తున్నాడు. ఏడాది కాలం పాటు లండన్-హైదరాబాద్ లలో కొన్ని టెక్నికల్ టీమ్ లతో గుణశేఖర్ వర్క్ షాప్స్ చేశారు. రుద్రమదేవికి పనిచేసిన టెక్నికల్ టీమ్ లో కొంత మంది గుణతో పాటు ట్రావెల్ అవుతున్నారు. తాజాగా అందిన సమాచారం మేరకు ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి పనులు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకి సహాయ దర్శకులుగా తెలుగు భాష సాహిత్యంపై పట్టున్న వారు కావలెను అంటు ట్విటర్ వేదికగా  ప్రకటన ఇచ్చారు. అందులో సినిమా టైటిల్ వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం గుణ ప్రాజెక్ట్  హిరణ్య కశిప కాబట్టి  దానికి సంబంధించిన టీమ్ నే రిక్రూట్ చేసుకుంటున్నట్లు సమాచారం. దీనిని బట్టి ఈ భారీ పాన్ ఇండియా సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. భారీ కాన్వాసుపై తెరకెక్కనున్న సినిమా కావడంతో భారీగా కొత్త  టీమ్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుణ శేఖర్ దగ్గర టెక్నికల్-నాన్ టెక్నికల్ స్టాప్ కొంత మంది ఉన్నారు. రుద్రమదేవి కి పనిచేసిన విదేశీ టెక్నిషీయన్లు ఆయనతో ట్రావెల్ అవుతున్నారు.

వాళ్లందిరితో పాటే ఈ కొత్త వాళ్లను జాయింట్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు భాషపై పట్టున్న వారందరినీ ఓ టీమ్ గా ఏర్పాటు చేసి స్క్రిప్ట్ కు సంబంధించిన పనుల్లో భాగస్వామ్యం చేస్తారట. హిరణ్య కశిపలో పౌరాణిక నేపథ్యం కూడా ఉంటుంది కాబట్టి భాషపై ఎంతో జ్ఞానం, అనుభవం తప్పనిసరి. అలాంటి వారికి హిరణ్య కశిప కి పనిచేసే అవకాశం మంచి వేదిక అవుతుందని అర్థమవుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: