బాహుబలి సినిమా విజయంతో భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ తనకంటూ ఏర్పరచుకొని మంచి పేరు సంపాదించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో బాహుబలి తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని భావించి భారీ బడ్జెట్ స్టోరీ కలిగిన సాహో సినిమా ఓకే చేసి నటించడం జరిగింది. కుర్ర డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకుంది. అయితే తీరా సినిమా రిజల్ట్ మొదటి షోకే దారుణంగా అట్టర్ ప్లాప్ అని టాక్ రావడంతో తీవ్రంగా నిరుత్సాహ పడ్డారు ప్రభాస్ అభిమానులు మరియు ప్రభాస్. దీంతో తన తర్వాత సినిమా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ విషయం లో చాలా జాగ్రత్తలు ప్రభాస్ చేసుకుంటున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వస్తున్నాయి.


ప్రేమకథా నేపథ్యంలో పాతకాలం నాటి ఒక యదార్థ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది ఇండస్ట్రీలో కొంత మంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఇటీవల సాహో సినిమా షూటింగ్ చిట్టచివరి లో జరుగుతుండగానే మరోపక్క ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన ప్రభాస్ సాహో సినిమా ఇచ్చిన రిజల్ట్ తో చాలావరకు రాధాకృష్ణ తో చేస్తున్న సినిమా కి బ్రేక్ ఇచ్చాడు.


ఇదే క్రమంలో బాహుబలి టీం తో కలిసి లండన్ వెళ్లి అక్కడే తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ప్రభాస్ ఇటీవల హైదరాబాద్ లో అడుగు పెట్టిన నేపథ్యంలో రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ నవంబర్ 18 నుంచి మొదలుపెట్టి చాలా తొందరగా వచ్చే సమ్మర్ కల్లా కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న క్రమంలో బడ్జెట్ విషయంలో కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేయాలని నిర్మాతలకు ప్రభాస్ సూచించినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నట్లు ఫిలింనగర్లో టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: