మహేష్ బాబు ఇప్పటికే
భరత్ అనే నేను,
మహర్షి సినిమాల సూపర్ డూపర్ హిట్స్ తో మంచి జోష్ మీదున్నారు. అయితే ఆయన ఫ్యాన్స్ మాత్రం
మహేష్ నుండి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన కమర్షియల్ సినిమాను ఎప్పటినుండో ఆశిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఫైనల్ గా ప్రస్తుతం
మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు
సినిమా ద్వారా వారి కోరిక తీరుతోంది. మొదటి నుండి తన సినిమాల్లో మంచి ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ హంగులను మిస్ కాకుండా చూసుకునే
అనిల్ రావిపూడి, ఈ సినిమాలో కూడా అంతకు మించేలా ఎంటర్టైన్మెంట్ ని జొప్పించడం జరిగిందట.
మహేష్ సరసన
గీత గోవిందం
భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి
విజయశాంతి,
సంగీత,
బండ్ల గణేష్ తో పాటు రాజేంద్ర
ప్రసాద్,
మురళి శర్మ,
వెన్నెల కిషోర్, సుబ్బరాజు, రావురమేష్,
ప్రకాష్ రాజ్, రఘుబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ
సినిమా విషయమై నేడు ఒక క్రేజీ వార్త పలు సోషల్
మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. అదేమిటంటే, కెరీర్ పరంగా
మహేష్ బాబు నటించిన చాలా సినిమాల్లో
ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించడం జరిగింది. అంతేకాక వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన మెజారిటీ సినిమాలు మంచి హిట్స్ అందుకున్నవే ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో కూడా
ప్రకాష్ రాజ్, కర్నూలుకు చెందిన ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ గా విలన్ పాత్రలో నటిస్తున్న
టాలీవుడ్ వర్గాల టాక్.
సో, దీనిని బట్టి చూస్తుంటే తప్పకుండా ఈసారి కూడా
ప్రకాష్ రాజ్ ఫాక్టర్, మన సూపర్ స్టార్
మహేష్ కు చాలావరకు కలసివస్తుందని పలువురు నెటిజన్లు సోషల్
మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ అనేవి బాగా నమ్ముతారని, అయినప్పటికీ ముఖ్యంగా సినిమాలోని కథ, కథనాలు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటే, అవేవి పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని అంటున్నారు కొందరు
సినిమా విశ్లేషకులు. మరి సరిలేరు నీకెవ్వరు విషయంలో ఈ సెంటిమెంట్ ఎంతవరకు పని చేస్తుందో చూడాలి....!!