నటిస్తున్న ప్రతి ఒక్క సినిమాతో తన ఇమేజి,
మార్కెట్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని అంతకంతకూ పెంచుకుంటూ పోతున్న
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇప్పటికే ఇటీవల రెండు వరుస విజయాలు అందుకున్నారు. ఇక ప్రస్తుతం
యువ దర్శకుడు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా
సినిమా సరిలేరు నీకెవ్వరు. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో
మహేష్ ప్రక్కన
రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు తన దర్శకత్వ కెరీర్ పరంగా
అనిల్ రావిపూడి వరుసగా నాలుగు సూపర్ హిట్స్ అందుకుని ఉండడంతో, తప్పకుండా
మహేష్ కు కూడా ఆయన మరొక సూపర్ హిట్ ఇచ్చి తీరుతారని
మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో నమ్మకాలు పెట్టుకున్నారు.
మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు అన్ని రకాల కమర్షియల్ హంగులతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కుతున్న ఈ సినిమాను కర్నూలు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇకపోతే లేడీ
అమితాబ్ విజయశాంతి ఈ సినిమాలో
భారతి అనే
ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నారు. ఆమె ఈ
సినిమా ద్వారా
టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుండడంతో ప్రేక్షకులు కూడా ఆమెను తెరపై చూడాలి అని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. ఇకపోతే కొన్ని
టాలీవుడ్ వర్గాల నుండి నేడు అందుతున్న సమాచారం ప్రకారం, ఈ
సినిమా ప్రీ రిలీజ్
బిజినెస్ దిమ్మతిరిగే రేంజ్ లో జరుగుతున్నట్లు టాక్. ఇప్పటికే ఈ
సినిమా ఓవర్సీస్ హక్కులను ఒక ప్రముఖ సంస్థ భారీ ధరకు దక్కించుకోగా,
మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల్లోని డిస్ట్రిబ్యూటర్లు అత్యధిక ధరలు ఇచ్చి ఈ సినిమాను దక్కించుకోవడానికి ఇటీవల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. దీనితో నిర్మాతలకు ఊహించిన దానికంటే కూడా ఎంతో ఎక్కువగా లాభాలు దక్కే అవకాశం కనపడుతోందట. చాలా రోజుల తరువాత
సూపర్ స్టార్ పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీలో నటిస్తుండడంతోనే దీనిపై ఇంత క్రేజ్ ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఈ వార్త నిజంగా
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు
పండుగ వార్త అనే చెప్పాలి. రాబోయే
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ
సినిమా ఏ రేంజ్
సక్సెస్ అందుకుటుందో చూడాలి.....!!