మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ మూవీ ఈరోజు అత్యంత ఘనంగా ప్రారంభం కాబోతోంది. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా రామ్ చరణ్ రాబోతున్నాడు. 

వాస్తవానికి మహేష్ తన మేనల్లుడు పై తీసే తొలి షాట్ కు క్లాప్ ఇచ్చే బాధ్యతను తీసుకోవాలని ఎంతో భావించినా ఒక చిన్న సెంటిమెంట్ మహేష్ ను ఈరోజు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమం నుండి దూరంగా ఉండేలా చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. మహేష్ తాను నటించే సినిమాలకు సంబంధించి ఏ మూవీ ప్రారంభోత్సవానికి సాధారణంగా హాజరు కాడు. 

గతంలో అలా ప్రారంభోత్సవంనాడు వ్యక్తిగతంగా హాజరైన కొన్ని సినిమాలు ఫెయిల్ కావడంతో తన సినిమాల ప్రారంభోత్సవానికి వీలైనంత దూరంగా ఉంటాడు మహేష్. ఇక మరీ ఒత్తిడి పెరిగిపోతే తన మూవీల ప్రారంభోత్సవాల కార్యక్రమానికి తన భార్య నమ్రతను పంపుతూ ఉంటాడు. ఇప్పుడు మహేష్ తన మేనల్లుడు గల్లా అశోక్ మొదటి సినిమా ప్రారంభోత్సవానికి దూరంగా ఉండబోతున్నాడు అన్న సంకేతాలు వస్తున్నాయి. 

దీనికితోడు ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ కు సంబంధించి కేరళలో ఉండటంతో ఒకవైపు సెంటిమెంట్ మరొకవైపు తన బిజీ అన్నీ దృష్టిలో పెట్టుకుని రామ్ చరణ్ ను ఈరోజు క్రార్యక్రమానికి ముఖ్య అతిధిగా పంపుతున్నట్లు టాక్. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు అనేకమంది ఇండస్ట్రీ ప్రముఖులు హాజరు అయ్యే ఈరోజు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ మూవీలో అశోక్ పక్కన హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఎంపిక చేయడమే కాకుండా ఆమెకు కోటి రూపాయల పారితోషికం ఇవ్వడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. మహేష్ వారసత్వాన్ని అతడి మేనల్లుడు ఎంతవరకు కొనసాగిస్తాడు అన్నది రానున్న రోజులలో తేలిపోతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: