ప్రస్థుతానికి ప్రమోషన్ విషయంలో ‘అల వైకుంఠపురములో’ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ కంటే చాల ముందడుగులో ఉంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెండు పాటలు విడుదల కావడమే కాకుండా ఆ రెండు పాటలకు కోట్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ఎక్కడ విన్నా బన్నీ సినిమా పాటలే వినిపిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్ విషయంలో వెనకపడింది అంటూ మహేష్ అభిమానులు తీవ్రంగా మధన పడిపోతున్నారు. ఇప్పుడు ఈ విషయాలకు చెక్ పెట్టడానికి ‘సరిలేరు నీకెవ్వరు’ కు సంబంధించి ఒక స్పెషల్ పి ఆర్ టీమ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాకు సంబంధించిన ఒక లిరికల్ వీడియోను వచ్చే వారం విడుదల చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ప్రమోషన్ ప్రారంభం కాబోతోంది. ఆ తరువాత ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లను చాల విభిన్నంగా నిర్వహించడమే కాకుండా ఈ మూవీ ప్రమోషనల్ మెటీరియల్ ను అందర్నీ ఆకర్షించే విధంగా డిజైన్ చేసే పనిలో ఇప్పుడు ఈ మూవీ పిఆర్ టీమ్ బిజీగా ఉన్నట్లు టాక్. 

ఇది ఇలా ఉండగా సంక్రాంతి కోడి పందాల స్థాయిని తలపిస్తూ జరగబోతున్న బన్నీ మహేష్ ల ఫైట్ ను నివారించి ఈ రెండు సినిమాలకు కనీసం ఒక్కరోజు అయినా గ్యాప్ ఉండేలా చేయాలని నిర్మాత దిల్ రాజ్ చేస్తున్న ప్రయత్నాలకు పూర్తిగా పరిస్థితులు అనుకూలించడం లేదు అని అంటున్నారు. దీనికి కారణం ఈ రాజీ మార్గం బన్నీ మహేష్ లకు నచ్చినా వారి మనసులో మాటను బయట పెట్టకుండా గాంభీర్యం నటిస్తున్న పరిస్థితులలో దిల్ రాజ్ రాజీ మార్గం ఒక అడుగు ముందు రెండడుగులు వెన్నక్కు అన్నట్లుగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: