మహేష్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయింది.  వచ్చే ఏడాది జనవరి 12 న సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఇక ఇందులో విజయశాంతి ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తోంది.  రష్మిక మందన్న హీరోయిన్.  ఈ సినిమాను అనిల్ రావిపూడి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  


ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  ఇందులో మహేష్ బాబు కాశ్మీర్ లో ఆర్మీ మేజర్ గా కనిపిస్తున్నారు.  మేజర్ అజయ్ కృష్ణగా కనిపిస్తున్నారు.  ఇంతవరకు బాగానే ఉన్నది.  అయితే, మహేష్ బాబు కాశ్మీర్ నుంచి హైదరాబాద్ రావడం అక్కడి నుంచి కర్నూల్ వెళ్లడం జరుగుతుంది.  కర్నూల్ లో మహేష్ బాబు ఏం చేయబోతున్నారు.. అన్నది సినిమాలో సస్పెన్స్.  


రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండబోతుంది.  కామెడీ పాయింట్ ఉన్నా..సినిమా మాత్రం సీరియస్ మోడ్ లోనే సాగుతున్నట్టు కనిపిస్తోంది.  అందరి డౌట్ ఏమిటంటే మహేష్ బాబు కర్నూల్ లో ఏం చేయబోతున్నారు.. కొండారెడ్డి బురుజు దగ్గర గొడ్డలి పట్టుకొని ఉన్న మహేష్ ఎవరిపై ప్రతీకారం తీర్చుకోబోతున్నారు అన్నది తెలియాలి.  


ఇక ఇదిలా ఉంటె, మేజర్ గా ఉన్నప్పుడు మహేష్ ఆర్మీ డ్రెస్ లో కనిపించారు.  అదే విధంగా, కర్నూర్ లో ఉండగా కూడా మహేష్ అదే ఆర్మీ ప్యాంట్ తో కనిపిస్తున్నారు.  మేజర్ గా ఉన్నప్పుడు శత్రువులపై ఎలా పోరాటం చేశారో... అదే విధంగా మహెష్ బాబు కర్నూలులో ఉండగా కూడా శత్రువులపై పోరాటం చేస్తారట.  మహేష్ శత్రువులు ఎవరు.. ఎలాంటి పోరాటం చేశారనే విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: