రకుల్ప్రీత్ సింగ్ బాలీవుడ్ ట్రాక్పై స్పీడ్ పెంచుతున్నట్లున్నారు . ‘దే దే ప్యార్ దే’ చిత్రంతో ఈ ఏడాది సూపర్ సక్సెస్ను రకుల్ప్రీత్ సింగ్ అందుకుంది . ఈ నెల 15న విడుదల కానున్న ‘మర్జావాన్’ అనే చిత్రంలో
రకుల్ నటించారు. ఇటీవలే మరో
హిందీ చిత్రానికి ఓకే చెప్పారు అందులో
రకుల్ అర్జున్కపూర్కు జోడీగా నటించబోతున్నారని తెలియచేశారు.
రకుల్ తన బాలీవుడ్ కెరీర్ గురించి ఇలా మాట్లాడుతూ– ‘‘దక్షిణాదిలో పాతిక చిత్రాలు పూర్తి చేశాను. నటిగా నన్ను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇప్పుడు బాలీవుడ్పై కూడా కొంచెం దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. అలాగని ఇక దక్షిణాది సినిమాలు చేయనని కాదు. కథ, అందులోని నా పాత్రను బట్టి
సినిమా చేయాలా? వద్దా అని నిర్ణయించుకుంటాను. కెరీర్ ఆరంభంలో మాత్రమే కాదు.. మరో స్థాయికి ఎదుగుతున్నప్పుడు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే కెరీర్ దెబ్బతింటుందని చెప్పుకొచ్ఛారు .
తప్పుడు నిర్ణయాలు తీసుకుని వేరే వారిపై నిందలు వేయడం తప్పని . మన తప్పుకు మనదే బాధ్యత. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ప్రస్తుతం హిందీలో మరో మూడు ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వెల్లడిస్తా’’ అని పేర్కొన్నారు.
ఈ నెల 20 నుంచి 28 వరకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్
ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) గోల్డెన్ జూబ్లీ వేడుకలు గోవాలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో పాల్గొనమని ఐఎఫ్ఎఫ్ఐ నుంచి రకుల్కు ఆహ్వానం అందింది. ప్రస్తుతానికి రకుల్తో పాటు విజయ్ దేవరకొండ,
నిత్యా మీనన్, రష్మికా మందన్నాలకు కూడా ఐఎఫ్ఎఫ్ఐ నుండి పిలుపొచ్చింది. జీవన శైలి, కెరీర్ జర్నీ తదితర అంశాలపై వీరు ప్రసంగించనున్నారు. సూపర్స్టార్లు
రజనీకాంత్, అమితాబ్బచ్చన్ కలిసి ఈ వేడుక ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.