తాజాగా ఏడు చేపల కథ సినిమాలో సెన్సేషన్‌ సృష్టించిన హీరో అభిషేక్‌ రెడ్డి. గతంలో తెలుగు తెర మీద కనిపించనంత బోల్డ్‌ క్యారెక్టర్స్ తో షాక్‌ ఇచ్చిన అభిషేక్‌, ఆ సినిమాతో తను ఆశించిన విజయం సాధించడం జరిగింది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌ రాకపోయినా కలెక్షన్లు మాత్రం గట్టిగానే  వస్తున్నాయి.


అయితే ఏడు చేపల కథ ఫీవర్‌ ఒక వైపు కొనసాగుతుండగానే మరో సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేశాడు ఈ కుర్ర హీరో అభిషేక్‌ రెడ్డి. "వైఫ్‌ ఐ" పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా ఏడు చేపల సినిమా కథ తరహాలోనే బోల్డ్ కంటెంట్‌ తో రూపొందుతోంది. "నైఫ్‌ ఈజ్‌ బెటర్‌ దాన్‌ వైఫ్‌" అనై ట్యాగ్ లైన్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను కూడా ఇప్పటికే పూర్తి చేసేచేసుకుంది. బోల్డ్ కంటెంట్‌ కారణంగా ఈ సినిమాకు కూడా ఏ సర్టిఫికేటే వచ్చేసింది.


ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఒకరు ప్రవర్తనతో ఒకరు విసిగిపోయిన భార్యా భర్తల కథతో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకు ఎక్కిస్తున్నారు. అభిషేక్‌ భార్య సాక్షి నిదియా నటిస్తున్న ఈ సినిమాలో కావ్య, సునీల్ నగరం, సూర్య ఆకొండి, మహేష్ విట్టా, అపర్ణలు కీలక పాత్రల్లో ఈ చిత్రంలో నటిస్తున్నారు.


జీఎస్‌ఎస్‌పీ కళ్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే ఎడిటింగ్ బాధ్యతలు కూడా ఆయనే వ్యవహరించడం చాల గమనార్హం. లక్ష్మీ చరిత ఆర్ట్స్‌, జీఎస్‌ఎస్‌పీకే స్టూడియోస్‌ బ్యానర్‌లపై జీ చరితా రెడ్డి ఈ సినిమాను చేస్తున్నారు. ఇక ముందు చూడాలి ఈ హీరో ఇంకా ఎన్ని సంచనాలని క్రియేట్ చేయబోతాడో చూడాలి మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: