టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమాకు సంబంధించి ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయిన టీజర్ మరియు సాంగ్స్ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ సంపాదించిన సంగతి తెలిసిందే. బన్నీ సరసన గతంలో డిజెలో జత కట్టిన పూజ హెగ్డే, ఈ సినిమాలో మరొక్కసారి ఆయన సరసన నటిస్తోంది. యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకు పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్ తో, 

అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా తప్పకుండా మంచి అవ్వాలని కసితో తెరక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రెండు లిరికల్ సాంగ్స్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోగా, అందులో సామజవరగమనా సాంగ్ కు యూత్ మరింత కనెక్ట్ అయ్యారు. అయితే ఆ సాంగ్ కు థమన్ అందించిన సూపర్బ్ ట్యూన్ తో పాటు యువ గాయకుడూ సిధ్ శ్రీరామ్ వాయిస్ మరింత ఆకర్షణ తీసుకువచ్చింది అనే చెప్పాలి. అల్లు అర్జున్ కు మలయాళంలో కూడా ఎంతో క్రేజ్ ఉండడంతో, నిన్న ఈ సినిమా మలయాళ వర్షన్ కు 'అంగు వైకుంఠపురత్తు' 

అనే టైటిల్ ని నిర్ణయించడంతో పాటు సామజవరగమనా సాంగ్ మలయాళ వర్షన్ ని కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఈ సాంగ్ మలయాళ వర్షన్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అయితే ఈ పాటను మాత్రం పాడింది మాత్రం సిద్ శ్రీరామ్ కాదు, ప్రముఖ సింగర్ ఏసుదాసు గారి తనయుడైన విజయ్ ఏసుదాస్. అయితే ఈ యూత్ ఫుల్ సాంగ్ ని విజయ్ ఎంతో బాగా ఆలపించడం జరిగింది. ఇక మలయాళ శ్రోతలు కూడా ఈ పాటకు ఎంతో కనెక్ట్ అవుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ సాంగ్ మంచి వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: