దేశంలో రెండే పరిశ్రమల మీద నటీమణులు  ద్రుష్టి పెడతారు. అవి టాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్లో రెమ్యున‌రేషన్ బాగా దక్కుతుంది. పైగా తొందరగా మూవీ అవుతుంది. టైం, పద్ధతి అన్నీ ఉంటాయి. గ్లామర్ బాగా ఆరబోస్తారు. ఇలా టాలీవుడ్ అంటే ఒక బిగ్ గేట్ వే అనుకుంటారు. ఆ తరువాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. ఇక్కడ నటిస్తే నేషనల్ వైడ్ ఫిగర్ కావచ్చునని ఒక ఆశ. ఇలా ఈ రెండూ కూడా దేశంలోని హీరోయిన్లకు అతి పెద్ద అట్రాక్షన్ గా ఉంటున్నాయి.


వెంకటాద్రి ఎక్స్ ప్రెస్  ద్వారా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ చాలా తొందరలోనే టాప్ హీరోయిన్  అయిపోయింది. ఆమెతో నటించాలని చాలా మంది స్టార్ హీరోలు ఒక దశలో క్యూ కట్టారు. అయితే వరసగా మూవీస్ ఫ్లాప్ కావడం రకుల్ తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్లు కలసి ఆమె కెరీర్ ని డౌన్ చేశాయి. 


దాంతో రకుల్ ఇపుడు తెగ ఫీల్ అవుతోంది. చేతిలో సినిమాలు లేవు. అందం ఉంది, అభినయమూ ఉంది కానీ ఏం లాభం ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర వేశారు. ఈ క్రమంలో రకుల్ ఇపుడు కొంత హర్ట్ అయినట్లుగా కూడా ఉంది. అందుకే ఆమె బై టాలీవుడ్ అంటోందని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్లోనే తన లక్ టెస్ట్ చేసుకోవాలని రకుల్ అనుకుంటోందట. 


అన్నీ కలసి వస్తే అక్కడే మంచి స్టార్ డమ్ సంపాదించాలని ఆశలు పెట్టుకుందట. మొత్తానికి రకుల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక ఆమె తెలుగు మూవీస్ లో కనిపించే అవకాశాలు లేవని అంటున్నారు, మరి చూడాలి బాలీవుడ్లో ఈ ముద్దు గుమ్మ కోరికలు ఎంతవరకూ నెరవేరుతాయో.



మరింత సమాచారం తెలుసుకోండి: